Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ కొత్త మూవీ ‘ఆగడు’ ప్రారంభం(ఫోటోలు)
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' వంటి హిట్ చిత్రం తర్వాత రాబోతున్న మరో చిత్రం 'ఆగడు'. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి బేనర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారి చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం(అక్టోబర్ 25) ఉదయం ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోలోని టెంపుల్లో జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి మూవీ మొఘల్ డి. రామానాయుడు క్లాప్ ఇవ్వగా, నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ...'మహేష్ కెరీర్లో, నా కెరీర్లో ఇది ఓ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది' అన్నారు.
ఆగడు మూవీ ఓపెనింగ్-1
అభిమానులు, ఆడియన్స్ మహేష్ని ఎలా చూడాలనుకుంటున్నారో అటువంటి క్యారెక్టర్లో చాలా కొత్తగా ఉంటూనే ఫుల్ మాసీగా కనిపిస్తాడు. ఎప్పటి నుండో మహేష్ని ఇలా చూడాలనుకుంటున్నాను. దానికి ట్రైలర్ లాంటిదే ‘దూకుడు'. ఇందులో మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంతకు ముందు చేయని డిఫరెంటు క్యారెక్టరైజేషన్తో ఉంటాడు. ఇది చాలా పెద్ద రేంజి సినిమా అవుతుంది' శ్రీను వైట్ల అన్నారు.
ఆగడు మూవీ ఓపెనింగ్-2
నిర్మాతలు మాట్లాడుతూ...‘మహేష్ బాబుతో దూకుడు, 1(నేనొక్కడినే) తర్వాత మేము చేస్తున్న మూడో సినిమా ‘ఆగడు', ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత పరుచూరి కోటి మాట్లాడుతూ...నవంబర్ 15 నుంచి ఏకధాటిగా జరుగుతుంది. ఏప్రిల్కి పూర్తవుతుంది. సమ్మర్ స్పెషల్గా మేలో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
ఆగడు మూవీ ఓపెనింగ్-3
మహేష్ బాబు సరసన తమన్నా తొలిసారి నటిస్తోంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.
ఆగడు మూవీ ఓపెనింగ్-4
ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.