twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్‌తో ఏమైంది? మౌనం వీడిన అల్లు అర్జున్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కూడా అయింది.

    సినిమా ప్రారంభోత్సవం జరిగినా....షూటింగ్ మొదలు కాక పోవడంతో సినిమాపై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా రద్దయిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా అల్లు అర్జున్ 'రుద్రమదేవి' షూటింగులో జాయిన్ అయ్యారు. మరో వైపు త్రివిక్రమ్ కూడా వేరే సినిమాకు పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

    Allu Arjun comment about Trivikram film

    ఈ గందరగోళంతో అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటనే విషయం అర్థం కాక అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇంత జరుగుతున్నా....అటు అల్లు అర్జున్ కానీ, ఇటు త్రివిక్రమ్ కానీ, మరో వైపు నిర్మాతలు కానీ స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ మౌనం వీడారు. మీడియాకు క్లారిటీ ఇచ్చారు.

    రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని స్పష్టం చేసారు. ఈ చిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్‌గా ఎంపికయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

    English summary
    Industry sources it is known that Allu Arjun movie with Trivikram has being shelved. However, Allu Arjun has announced that the film’s shoot will start soon. The actor made this comment at a public event in Rajahmundry yesterday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X