Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
త్రివిక్రమ్తో ఏమైంది? మౌనం వీడిన అల్లు అర్జున్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కూడా అయింది.
సినిమా ప్రారంభోత్సవం జరిగినా....షూటింగ్ మొదలు కాక పోవడంతో సినిమాపై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా రద్దయిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా అల్లు అర్జున్ 'రుద్రమదేవి' షూటింగులో జాయిన్ అయ్యారు. మరో వైపు త్రివిక్రమ్ కూడా వేరే సినిమాకు పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.
ఈ గందరగోళంతో అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటనే విషయం అర్థం కాక అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇంత జరుగుతున్నా....అటు అల్లు అర్జున్ కానీ, ఇటు త్రివిక్రమ్ కానీ, మరో వైపు నిర్మాతలు కానీ స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ మౌనం వీడారు. మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని స్పష్టం చేసారు. ఈ చిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్గా ఎంపికయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.