Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రూ.100 కోట్లు సాధించటం కొలమానం కాదు
మసాలా, ఫార్ములా చిత్రాలకు ఏ మాత్రం వ్యతిరేకిని కాను. కేవలం వంద కోట్ల రూపాయలు రాబట్టుకోవాలనే దృక్పథంతో చిత్రాలను నిర్మించటం తగదని భావిస్తా. రూ.100 కోట్ల బడ్జెట్తో చిత్రాలను నిర్మించి.. అంతేస్థాయిలో వసూళ్లు రాబట్టి చివరకు ఇరానీ, యూరోపియన్ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడటం తగదన్నారు. ఇరానీ చిత్రాలు రూ.కోటి బడ్జెట్తో నిర్మితమైనవేనని గుర్తించాలి.
కళాత్మక చిత్రాలను తీయాలనే దృక్పథం ఉంటే చాలు. మనసు పెడితే సమకాలీన, ప్రాంతీయ, సంస్కృతి ప్రాధాన్యత కల్గిన చిత్రాలను తీయటం ఓ సమస్య కాబోదు. మొత్తం సినిమా కథను రాయటం.. చివరి రెండు లైన్లలో కళాకారుల నటనను వివరించటం.. అదే ఓ సమీక్ష, విమర్శ కాదు. కథల్లో సత్తా ఉన్నంత వరకూ ఎటువంటి సమీక్షలు, విమర్శలు సినిమా వ్యాపారాన్ని అడ్డుకోలేవు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై ఇటీవల ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించబోను. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు. 45 ఏళ్ల సినీజీవితంలో సాధించిన అనుభవాల్ని కొత్త తరానికి పంచుతా. చిత్రలేఖనం, క్రికెట్ అంటే ప్రాణం. బెంగళూరు నగరం ఎంతోగానో ఆకట్టుకొంది. కర్ణాటకలో చిత్రాలు తీయమని ఎవరైనా అడిగితే ఆనందంగా ఒప్పుకుంటానని అమోల్ పాలేకర్ అన్నారు.