Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇంకో వివాదంలో మహేష్ ‘ఆగడు’
హైదరాబాద్ : మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రం ప్రారంభంలో కోన వెంకట్, గోపీ మోహన్ ల కాంట్రవర్శలతో ప్రారంభమైతే, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కాంట్రావర్శి వచ్చి చేరింది. అది సర్దుకోగానే టీజర్ తో కాంట్రావర్శి మొదలైంది. మహేష్ వచ్చి మరీ వివరణ ఇచ్చాక అది ఆగింది. ఇప్పుడు మరో కాంట్రావర్శి స్టార్ట్ అయ్యింది.
ఈ సారి...ఈ చిత్రానికి ఆనంద్ రవి అనే రచయిత వర్క్ చేసారని, అతని పేరు టైటిల్స్ లో వేయటంలేదని వివాదం అంతటా మొదలైంది. శ్రీను వైట్ల మరో రచయితకు అన్యాయం చేస్తున్నాడని చెప్పుకున్నారు. అయితే ఈ వివాదానికి స్వస్ధి పలకటానికి ఆనంద్ రవి స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన తనకు శ్రీను వైట్ల అంటే ఇష్టమని,అయితే ఆగడు చిత్రానికి మాత్రం పనిచేయలేదని, అసలు శ్రీను వైట్లతోనే పరిచయం లేదని అన్నారు.
కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలందిస్తున్నారు.
'ఆగడు' టీజర్ లో మహేష్ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది.
పంచ్ డైలాగు లేకపోతే.. టీజర్, ట్రైలర్ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్లు పేలుతున్నాయి. అయితే మహేష్బాబు మాత్రం పంచ్లపైనే పంచ్ వేసేశాడు. 'ఆగడు' టీజర్లో. మహేష్బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.