Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమ్మేసారు: రాజేష్ ఖన్నా ఆస్తి తగాదా మళ్లీ కోర్టుకు
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణం తర్వాత ఆయన ఆస్తుల వ్యవహారంలో నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజేష్ ఖన్నా నివాస భవనం 'ఆశీర్వాద్' విషయంలో ఆయన కూతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకి ఖన్నా.....ఆయనతో సహజీవనం చేసిన అనితా అద్వానీ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
తండ్రి మరణం అనంతరం ఆ భవనం ట్వింకిల్, రింకీ ఖన్నాలకు సంక్రమించగా...వారు ఆ బంగ్లాను ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మణ్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆ బంగ్లాను మ్యూజియంగా మార్చాలని రాజేష్ ఖన్నా ఆశ పడ్డారు. కానీ కూతుర్లు ఇలా చేసారనే వార్తి విని పలు అభిమానులు నివ్వెరపోతున్నారు.
మరో వైపు ఆ ఇంటిలో తనకూ వాటా ఉందని అనితా అద్వానీ ఇప్పటికే కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. రాజేష్ ఖన్నాతో అతని భార్య డింపుల్ ఖన్నా విడిపోయిన తర్వాత అనిత అద్వానీ ఆయనకు దగ్గరయ్యారు. ఆయన మరణించడానికి ఎనిమిదేళ్ల ముందు నుండే రాజేష్ ఖన్నాతో సహజీవనం చేస్తున్నారు.
ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదంటూ అనితా అద్వానీ కోర్టుకు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. బంగ్లా విషయంలో గతంలో తనకు కోర్టు నుండి అనుకూల తీర్పు వచ్చిందని, కోర్టు తీర్పును గౌరవించకుండా రాజేష్ ఖన్నా కూతుర్లు ఆ బంగ్లాను అమ్మడం సరికాదని ఆమె అంటున్నారు. బంగ్లా అమ్మకుండా తుది వరకూ పోరాడుతానని ఆమె తెలిపారు.