Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
చింత వద్దు....‘మనం’లో అక్కినేని పార్ట్ పూర్తి!
హైదరాబాద్: తన నట వారసులు నాగార్జున, నాగ చైతన్యతో కలిసి అక్కినేని నాగేశ్వరరావు 'మనం' అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అయితే అక్కినేని మరణం నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోతుందేమో? అక్కినేని చివరి సినిమా చూడలేమేమో? అనే ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాజాగా చిత్ర చూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే....'మనం' చిత్రంలో అక్కినేని కనిపించే సన్నివేశాల షూటింగ్ పార్టు పూర్తయిందని, డబ్బింగ్ ప్రకియ కూడా ఆయన కంప్లీట్ చేసారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఉగాదికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి గతంలో ఓసారి నాగార్జున మాట్లాడుతూ 'నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం నాకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. మా బేనర్లో ఈ చిత్రం ఓ ప్రెస్టీజియర్ చిత్రం అవుతుంది' అన్నారు.
కాగా..బుధవారం పరమపదించిన తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ...ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే జరుపాలని నిర్ణయిచారు.
ఈ రోజు (గురువారం) మధ్యహ్నం రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది అక్కినేనికి గౌరవంగా గన్ సెల్యూట్ చేయనున్నారు. ఈ మహానటుడి అంత్యక్రియలకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసారు.