Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
తట్టుకోలేక అనుష్క విలవిల, ట్విట్టర్ ద్వారా ప్రకటన
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం సినిమా షూటింగులో భాగంగా రాజాస్థాన్లోని జోధ్ పూర్లో ఉంది. ఇక్కడ ఆమె తన తాజా సినిమా 'ఎన్హెచ్ 10' చిత్రంలో నటిస్తోంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడం, ఓ వైపు ఎండలు మండి పోతున్నాయి. ఇదే సమయంలో ఇసుక తుఫాను రావడంతో షూటింగుకు అంతరాయం ఏర్పడింది.
ఇసుక తుఫాను రావడంతో చాలా భయ పడ్డామని అనుష్క తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. యూనిట్ మొత్తం కూడా ఈ ఇసుక తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మొత్తానికి అంతా సురక్షితంగా బయట పడ్డామని అనుష్క శర్మ చెప్పుకొచ్చారు. ఎన్.హెచ్ 10 చిత్రానికి నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంతో పాటు అనుష్క శర్మ 'బాంబే వెల్వెట్' చిత్రంలో కూడా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే శ్రీలంకలో షూటింగ్ పూర్తయింది. రణబీర్ కపూర్, అనుష్క శర్మ, కరణ్ జోహార్, రవీనా టండన్, కెకె మీనన్, సిద్ధార్థ బసు తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు. ఈ సంవత్సరం క్రిస్మస్ నాటికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.