Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈ సారి బాలకృష్ణ నవ్విస్తాడు
హైదరాబాద్ : బాలకృష్ణ చిత్రంలో కామెడీ సన్నివేశాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు, డైలాగులపైనే దర్శకులు దృష్టి పెడుతూంటారు. అయితే తాజాగా బాలకృష్ణ చిత్రంలో కామెడీకి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కామెడీ సీన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. బయిట కామెడీ ట్రెండ్ నడుస్తూండటంతో తన చిత్రంలోనూ వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బాలయ్య కోరారని సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో కొంత భాగం కామెడీకి కేటాయించినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవా దర్శకుడు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. ఫిల్మ్సిటీలోని ఫ్లెక్స్ హౌస్లో బాలకృష్ణ, ఇతర ముఖ్య పాత్రధారులపై హాస్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మరోవైపు బాలకృష్ణ, ఫైటర్లపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 8 వరకు ఇక్కడే చిత్రీకరణ జరుగుతుంది. ''బాలకృష్ణను శక్తిమంతమైన నాయకుడిగా చూపించే చిత్రమిది. దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చక్కగా ఉంది. బాలకృష్ణ పాత్ర చిత్రణ, కథ, కథనాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి'' అంటోంది చిత్రబృందం. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.
బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య గత చిత్రాల తరహాలో ఉండబోతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ... అన్యాయం జరిగినప్పుడు, పేదవాడి ఆక్రందన విన్నప్పుడు, నీతికి చెదలు పడుతున్నప్పుడు భగవంతుడొస్తాడో రాడో తెలీదుగానీ ఓ నాయకుడు మాత్రం వస్తాడు. చీడ పురుగుల పీడ నుంచి వ్యవస్థను, తనని నమ్ముకొన్నవాళ్లను కాపాడతాడు. అలాంటి వ్యక్తి కథే మా చిత్రం అంటున్నారు సత్యదేవా. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది.
నిర్మాత మాట్లాడుతూ... ''బాలకృష్ణ పాత్ర చిత్రణ, ఆయన సంభాషణలు చిత్రానికి ప్రాణం. ప్రతి సన్నివేశం అందరికీ నచ్చేలా ఉంటుంది''అని చెప్పారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి రుద్రపాటి రమణారావు నిర్మాత. రామ్లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణ తదితరులపై పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.