Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'బసంతి' విడుదల ఈ నెల్లోనే
హైదరాబాద్ : 'బాణం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు చైతన్య దంతులూరి. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బసంతి'. కళాశాల నేపథ్యంలో ఉగ్రవాద సమస్యను కథాంశంగా ఎంచుకున్న ఈ చిత్రంలో గౌతమ్ హీరోగా నటిస్తుండగా అలీషాబేగ్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పిభ్రవరి 27న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
చైతన్య దంతులూరి మాట్లాడుతూ ''ఉగ్రవాదం సమస్యని నేపథ్యంగా ఎంచుకొని తెరకెక్కించిన సినిమా ఇది. బసంతి కళాశాలలో చదివే విద్యార్థిగా గౌతమ్ కనిపిస్తారు. బాణం చిత్రానికి ముందే ఈ బసంతి చిత్ర కథ సిద్ధమైంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి స్టూడెంట్కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము. బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స అండ్ సైన్స్'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్గా గౌతమ్ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.''అన్నారు.
హీరో గౌతమ్ మాట్లాడుతూ ''ఓ మంచి కథ బసంతి. దర్శకుడు కథ చెబుతున్నపుడు ఎంతో ఆసక్తి కలగడంతో పాటు, ఉద్వేగా నికి లోనయ్యాను. నేను పోషిస్తున్న అర్జున్ పాత్ర నటుడిగా నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నా''అన్నారు.
నక్సలిజం సమస్యని... తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా 'బాణం' రూపంలో తెరకెక్కించారు దర్శకుడు చైతన్య దంతులూరి. ఇప్పుడు ఆయన దర్శకనిర్మాణంలో వస్తోన్న మరో చిత్రం 'బసంతి'. ఇందులో తీవ్రవాదాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. గౌతమ్, అలీషాబేగ్ జంటగా నటించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: మణిశర్మ, కళ: రఘు కులకర్ణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: అనీల్ బండారి, పి.కె.వర్మ.