Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మంచు లక్ష్మి వివాదం : బెల్లంకొండ వివరణ
హైదరాబాద్: బెల్లంకొండ సురేష్ తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని ఆయన ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన వ్యక్తులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ ని మీడియావారు ప్రశ్నించారు. దానికి బెల్లంకొండ సురేష్ సమాధానమిచ్చారు. గతంలో తన బ్యానర్ లో మంచు విష్ణుతో ఓ చిత్రం నిర్మించేందుకు అరవై లక్షలు అడ్వన్స్ ఇచ్చానని, అది సినిమా చేయలేకపోయామని ఆ మొత్తంలో తను ఇవ్వల్సిన మొత్తం ని ఎడ్జెస్ట్ చేసుకోమన్నాని అన్నారు. మంచు విష్ణు సైతం దానికి ఒప్పుకున్నారని అన్నారు.
అయితే మంచు లక్ష్మి మాత్రం దానికీ, దీనికి లింకు పెట్టవద్దని,తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరుతోందని, అది ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు.మంచు విష్ణుకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుతో చిత్రం ప్రారంభిద్దామనుకున్నా కథ సిద్దం కాకపోవటంతో ప్రారంభం చేయలేకపోయామని అన్నారు.
ఇక ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో సంతోష్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం రభస. బెల్లంకొండ సురేష్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం గురువారం విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఊహించని ట్విస్ట్ ...మంచు లక్ష్మి రూపంలో వచ్చింది. తమకు పే చెయ్యాల్సిన పేమెంట్స్ ఇవ్వందే విడుదల చేయటానికి కుదరదని అంటున్నారు.
ప్రముఖ నటి మంచు లక్ష్మి అనుచురులు మరో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంటిముందు ధర్నా నిర్వహించారు. తమకు రావాల్సిన డబ్బలు ఇవ్వాలంటూ ఈ ధర్నా సాగింది. రాత్రి తొమ్మిది గంటల ప్రాతంలో ఈ ధర్నా చోటు చేసుకుంది. పోలీసులు సర్ధుబాటు చేసి పంపాల్సి వచ్చింది.
సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే... మంచు లక్ష్మి నిర్మించిన ఊ కొడతారా...ఉలిక్కి పడతారా చిత్రం గంధర్వ మహల్ సెట్ ని నిర్మాత బెల్లంకొండ సురేష్ రభస చిత్రం కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందు నిమిత్తం 58 లక్షల రూపాయలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పుకున్న పేమెంట్ ఇవ్వకపోవటంతో మంచు లక్ష్మి అనుచురులు ఇలా ధర్నాకు దిగారని తెలుస్తోంది.
ఇంతకుముందు ఇలాంటి వివాదాలను మధ్యవర్తులు ద్వారా పరిష్కరించుకునేవారు. అయితే ఇప్పుడు లక్ష్మి అభిమానులు..అనుచరులు అంటూ కొంతమంది ధర్నాకు దిగటం ఆశ్చర్యంగా ఉంది. ఇక డబ్బులు చెల్లించాకే సినిమాని విడుదల చేసుకోవాలని చెప్పారు. దాంతో బెల్లంకొండ సురేష్ ఇంటిముందు ఆందోళన పరిస్ధితి ఏర్పడింది. పోలీసులు వచ్చి సమీక్షించేవరకూ ఆగలేదు.