Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
హుర్రే! చిరంజీవి ఖరారయ్యాడు, ఫ్యాన్స్ హాపీ!
హైదరాబాద్ : రామ్చరణ్, కాజల్ హీరో హీరోయిన్లుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఆడియోను సెప్టెంబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆడియో వేడుకకు గెస్ట్ ఎవరనే విషయం ఖరారైంది. మెగా స్టార్ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్గా హాజరై సీడీలు విడుదల చేస్తారని తెలుస్తోంది.
బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబరు 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యువన్శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా రీరికార్డింగ్ పనులు మంగళవారం మొదలయ్యాయి.
నిర్మాత గణేష్ సినిమా గురించిన వివరాలు తెలియజేస్తూ 'సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కృష్ణవంశీ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్శంకర్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్సవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్కు అనూహ్యమైన స్పందన లభించింది. రామ్ చరణ్ లుక్స్ను అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. సెప్టెంబర్ 15న పాటలనూ, అక్టోబర్ 1న చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రంలో ఇంకా శ్రీకాంత్, ప్రకాష్రాజ్, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.