Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజేంద్రప్రసాద్కు దాసరి స్వర్ణ కంకణ పురస్కారం
సినీ దర్శకులు రేలంగి నరసింహారావు అధ్యక్షులుగా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు కె.ధర్మారావు కన్వీనర్గా ఏర్పాటైన కమిటీ దాసరి నారాయణరావు పేరిట నెలకొల్పిన ఈ మొట్టమొదటి పురస్కారానికి 200 చిత్రాల నటించిన ప్రముఖ సినీ నటుడు డా.రాజేంద్రప్రసాద్ను ఎంపిక చేసారు.
ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వర్ణ కంకణాన్ని బహూకరిస్తారని తెలియజేసారు. సభాధ్యక్షులుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.విజయ్ బాబు, విశిష్ట అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ, వీరశంకర్, ఎన్.శంకర్, శివనాగేశ్వరరావు, నీలకంఠ, అల్లాణి శ్రీధర్, జి.రాంప్రసాద్, వి. ఈశ్వరరెడ్డి, రేలంగి నరసింహారావు, శ్రీమతి బి.జయ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఈశ్వర్ రావు, శివకృష్ణ, గౌతం రాజు, గుండు హనుమంతరావు, కొండ వలస తదితరులు పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 'గానభూషణ' ఆమని బృందం చే 'దాసరి సినీ సంగీత విభావరి' నిర్వహించనున్నట్లు తెలియజేసారు.