Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
టొరంటో 'ఆఫ్టర్ డార్క్ 'లోనూ 'ఈగ' జోరు
ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈచిత్రం ఇంతకుముందు బి. నాగిరెడ్డి అవార్డుకు ఎంపికయింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించిన సాయి కొర్రపాటి అవార్డును అందుకోనున్నారు. నాగిరెడ్డి జయంతి రోజున అవార్డు ప్రధానం జరుగనుంది. ఇక ఈ సినిమాలో కళా దర్శక పరంగా కీలకమైన కృషి చేసిన కళాదర్శకుడు రవీందర్కి అరుదైన పురస్కారం లభించింది. కళాదర్శకుడు రవీందర్, ప్రతిష్టాత్మకమైన బ్రెజిల్ చిత్రోత్సవంలో పురస్కారం అందుకొన్నారు. అలాగే 60వ జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవడంతో పాటు, విజువల్ ఎఫెక్ట్ విభాగంలోనూ అవార్డులు దక్కించుకుంది. ఇవే కాకుండా అనేక అవార్డులు ఈ చిత్రాన్ని వరించాయి. తాజాగా ఈచిత్రం ప్రఖ్యాత అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు 'ఈగ' చిత్రాన్ని కూడా ఎంపిక చేసారు.
"సినిమా చేసేటప్పుడు అవార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించను. వాటిని ఎప్పుడూ సీరియస్గా తీసుకోను. ప్రకటించారని తెలిసినప్పుడు సంతోషంగా ఉంటుంది'' అని రాజమౌళి గతంలో 'ఈగ' జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైనప్పుడు అన్నారు. 'ఈగ' దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...నేను నిద్రపోతుంటే 'బాహుబలి' నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఫోన్ చేసి 'ఈగ'కు అవార్డులు వచ్చాయని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్కు వచ్చినందుకు ఆనందమే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అవార్డుల గురించి చాలా మంది మాట్లాడారు కానీ నేను పట్టించుకోలేదు. నా దృష్టిలో 'ఈగ' సినిమా పూర్తయింది. ఇప్పుడు 'బాహుబలి' మీదే నా దృష్టి అన్నారు.