Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెండితెరపై 'గబ్బర్ సింగ్' కూతురు
హిందీ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషిస్తూ కూడా ప్రేక్షకుల గుండెల్లో హీరో స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అంజాద్ ఖాన్. 'గబ్బర్ సింగ్' అంటూ వంద కోట్ల రూపాయలు గుమ్మరించిన పవన్ కల్యాణ్ సినిమాలోని ఈ పాత్ర వెనుక ఉన్న అసలు గబ్బర్ సింగ్ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు 'షోలే' చిత్రంతో బాలీవుడ్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి మహానటుడి వారసురాలు కూడా వెండి తెరపై తళుక్కున మెరవనుంది.
అంజాద్ ఖాన్ కుమార్తె అయిన అహ్లమ్ తన మొదటి చిత్రంతో హిందీ చిత్రపరిశ్రమలో కాలుమోపనున్నది. తాను చిత్రపరిశ్రమకు ఇప్పుడు పరిచయం అవుతున్నప్పటికీ నాటక రంగంలో ఎప్పటి నుంచో ఉన్నానని అంటోంది అహ్లమ్. రచయిత, దర్శకుడు మకరంద్ దేశ్పాండే నాటకం 'మిస్ బ్యూటిఫుల్'ని ఆయనే నిర్మాతగా తెరకెక్కించనున్నారు. హిందీలో 'మిస్ సుందరి'గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అహ్లమ్ నటించనుంది.
ఈ చిత్రాన్ని, తక్కువ బడ్జెట్తో తెరకెక్కుతున్న దీన్ని వ్యాపార దృష్టితో నిర్మించడంలేదని అంటున్నారు. మకరంద్. 'మిస్ బ్యూటిఫుల్' నాటకంలోని ఈ పాత్రను అహ్లమ్ పలుమార్లు పోషించిందని, సినిమాలో కూడా ఈమెను కాకుండా మరొకరిని వూహించలేనని అంటున్నారీయన. ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయిన అహ్లమ్ ఈ చిత్ర ప్రచారంలో కూడా పాలుపంచుకుంటుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చిలో ప్రేక్షకులను అలరించనుంది.