Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘గీతాంజలి’ పోస్టర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ (ఫోటోలు)
హైదరాబాద్: అంజలి కధానాయికగా తెలుగులో 'గీతాంజలి' చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ వ్రాసారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించారు. పవన్ కళ్యాణ్తో కోన వెంకట్కు మంచి రిలేషన్ షిప్ ఉంది. దీంతో స్వయంగా పవన్ కళ్యాణ్ వద్దకు పోస్టర్లను తీసుకెళ్లి విడుదల చేయించారు. పవన్ కళ్యాణ్ నివాసంలోనే వీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది.
పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....
కోన వెంకట్ మాట్లాడుతూ...
ఈ చిత్రం కధ పరంగా అద్భుతంగా ఉంటుందని, చిత్రంలో నటి అంజలి పోషించే పాత్ర తెలుగుప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందని కోన వెంకట్ తెలిపారు.
సంగీతం, కెమెరా...
చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.
ఇతర ముఖ్య పాత్రల్లో
చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేశ్, శ్రీనివాస రెడ్డి, మధు నందన్ తదితరులు నటిస్తున్నారు.
అంజలి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా చిత్రాల అనంతరం నటి అంజలి తెలుగుచిత్రాలలో నటించలేదు. వాటి తర్వాత అంజలి నటించే చిత్రం ఇదే...
ఇపుడు ఆచిత్రాలపై ఆసక్తి
మారుతి సినిమా ప్రేమకథాచిత్రమ్తో హారర్, కామెడీ జోనర్కు తెలుగులో ఆదరణ పెరిగింది. ఈ తరహా చిత్రాలు ఇప్పుడు మరిన్ని రూపుదిద్దుకోనున్నాయి. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కూడా ఇలాంటి కథేనట. ఈ సినిమాలో భయం + వినోదం రెండింటినీ మేళవించిన తీరు ఆకట్టుకొంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతినిస్తుంది.. అని కోన వెంకట్ చెబుతున్నారు.