Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘రామయ్యా వస్తావయ్యా’...ఇదీ లాభనష్టాల లెక్క!
అయితే ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత చెబుతున్న వివరాలను పరిశీలిస్తే సినిమా పెట్టబడి రికవరీ చేస్తుందనే నమ్మకం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారట. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు దిల్ రాజు సంతోషంగానే ఉన్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...'సినిమాకు స్పందన బాగుంది. తొలి మూడు రోజుల్లోనే రూ. 20 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజుల్లో సినిమా పెట్టుబడి తిరిగి వస్తుంది. ఒక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా ఎంతో సంతోషంగా ఉన్నాను' అని దిల్ రాజు మీడియాకు వెల్లడించారు.
ఈ చిత్రంలో ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత,శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు.