twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటు వేయకుండా డుమ్మూ కొట్టిన స్టార్స్ వీరే (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై : ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రధానమైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి నాయకులను ఎన్నుకుని దేశ అభివృద్ధికి పాటు పడాలని ఓ వైపు ఎన్నికల సంఘం, పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తుండటంతో..... ఎంతో మంది సాహాన్య ప్రజల్లో మార్పు వచ్చింది. గతంలో ఓటుకు దూరంగా ఉన్న వారు సైతం ఈ సారి తమ బాధ్యతను గుర్తించి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    అయితే కొందరు సినిమా తారలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు......నిన్న ముంబైలో జరిగిన పోలింగులో ఓటు వేయకుండా డుమ్మా కొట్టి అమెరికాలో జరుగుతున్న 'ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'కు తరలి వెళ్లారు. ప్రజలకు రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన బాలీవుడ్ సినిమా తారలు సైతం ఇలా ఓటు హక్కను నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ-జావేద్ అక్తర్ ఓటును నిర్లక్ష్యం చేసారు. ఓటు వేయకుండా డుమ్ము కొట్టి ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. సామాజిక బాధ్యతలు, రాజకీయాల గురించి నీతులు చెప్పే ఈ జంట ఓటింగుకు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. జావేద్ అక్తర్ రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. షబానా అజ్మీ మాజీ రాజ్యసభ ఎంపీ. ఇలాంటి వ్యక్తులు కూడా ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వక పోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

    అలాంటి వారి వివరాలు స్లైడ్ షోలో...

    షబానా అజ్మీ-జావేద్ అక్తర్

    షబానా అజ్మీ-జావేద్ అక్తర్

    బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ-జావేద్ అక్తర్ ఓటును నిర్లక్ష్యం చేసారు. ఓటు వేయకుండా డుమ్ము కొట్టి ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు.

    అనిల్ కపూర్

    అనిల్ కపూర్

    ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓటు వేయకుండా అమెరికాలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారు.

    హృతిక్ రోషన్

    హృతిక్ రోషన్

    నటుడు హృతిక్ రోషన్ ఓటింగు కార్యక్రమానికి డుమ్మా కొట్టి అమెరికాలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారు.

    షాహిద్ కపూర్

    షాహిద్ కపూర్

    నటుడు హృతిక్ రోషన్ ముంబైలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనకుండా అమెరికాలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారు.

    సైఫ్ అలీ ఖాన్

    సైఫ్ అలీ ఖాన్

    బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలో జరిగిన ఓటింగు కార్యక్రమానికి డుమ్మా కొట్టి అమెరికాలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారు.

    కరీనా కపూర్

    కరీనా కపూర్

    హీరోయిన్ కరీనా కపూర్ ముంబైలో జరిగిన ఓటింగు కార్యక్రమానికి డుమ్మా కొట్టి అమెరికాలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారు.

    English summary
    Bollywood celebrities Javed Akhtar and Shabana Azami decided not to cast their votes and chose to attend IIFA awards function in US. For a couple who always talk about working for social and political causes, how could they skip the biggest celebration of Indian democracy?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X