Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఎన్టీఆర్ సినిమాపై కొత్త రూమర్ ...ఖండన
హైదరాబాద్ : ''సినిమా తేదీల విషయంలో ఎటువంటి సమస్య లేదు. తొలుత అనుకున్నట్లుగా ఎన్టీఆర్, పూరిల సినిమాలో చేస్తున్నాను'' అని కాజల్ చెప్పింది. ఇకనైనా పుకార్లు ఆగుతాయేమో చూడాలనే ఆశాభావం వ్యక్తం చేసింది. పూరి,ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం నుంచి కాజల్ తప్పుకుందంటూ,డేట్స్ ఇబ్బందంటూ వార్తలు గత నాలుగైదు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఈ విషయమై ఆమె ఇలా స్పందించింది.
అలాగే... ''నేను ఏదైనా సినిమా అంగీకరించానంటే దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టను. డేట్స్ కుదరడం లేదనో, సమయం లేదనో చెప్పను''అంటోంది కాజల్. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'గోవిందుడు అందరివాడేలే'తోపాటు ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ సినిమాల్లో చేస్తోంది. వీటితోపాటు తమిళం, హిందీల్లో ఒక సినిమా చేస్తోంది.
అదేంటో ఈ చిత్రం మొదలైన దగ్గరనుంచి ఏదో విషయమై రూపర్స్ వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజులు టైటిల్స్ గురించి, మరి కొద్ది రోజులు కథ విషయమై, తర్వాత హీరోయిన్స్ విషయమే...ఇప్పుడు కాజల్ విషయమే...ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. వీటిని ఎవరు క్రియేట్ చేస్తున్నారనే విషయం కన్నా ఎన్టీఆర్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో చిత్రం అంటే ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయన్నది మాత్రం నిజం అంటోంది సినీ పరిశ్రమ.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. పూర్తి మాస్ మసాలాతో సాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రం నిర్మిస్తున్నారు.
బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.