Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
థియేటర్ అద్దాల్ని పగులకొట్టి, ఫర్నిచర్ ధ్వంసం
బెంగళూరు : మాణిక్య (తెలుగులో మిర్చి)సినిమా ఓపెనింగ్స్పై నటుడు, దర్శకుడు సుదీప్ సంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మాణిక్య సినిమా విడుదలైంది. అన్ని కేంద్రాల నుంచి మంచి నివేదికలు అందుతున్నాయన్నారు. ఎంతో శ్రమకోర్చి సినిమాను రూపొందించామని అందుకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండడం సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. అయితే రిలీజ్ రోజు కొన్ని చోట్ల థియోటర్స్ లో సమస్య ఎదురైంది. దాంతో థియోటర్ అద్దాలు పగలకొట్టారు.
వివరాల్లోకి వెళితే... సుదీప్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్ అద్దాల్ని పగులకొట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మండ్య లోని మహావీర్ థియేటర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సుదీప్ హీరోగా నటించిన మాణిక్య (తెలుగులో మిర్చి) సినిమా విడుదలైంది. తొలి ప్రదర్శనన వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
ప్రదర్శన ఆరంభమైన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రెచ్చిపోయిన అభిమానులు అద్దాల్ని పగులకొట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ఇతర అనేక కేంద్రాల్లో కూడా సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిసింది.