Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబుకు గాయం, ఆగడు షూటింగ్ ఆగింది?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు ప్రస్తుతం 'ఆగడు' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం బళ్లారి ప్రాంతంలో జరుగుతోంది. షూటింగు జరుగుతుండగా మహేష్ బాబు కాలుగుకు గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైద్యులు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో షూటింగ్ నిలిపి వేసినట్లు సమాచారం. ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ స్క్రిప్టు అందించారు. మహేష్ బాబు సరసన హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. ప్రముఖ నటి నదియా ఈ చిత్రంలో మహేష్ బాబు అక్క పాత్రలో కనిపించనుంది.
నదియా, మహేష్ బాబు కలిసి నటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆగడు చిత్రంలోనూ ఆమె తనదైన ముద్ర వేస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మళయాలం మూవీ దిృశ్యం తెలుగు రీమేక్లో కూడా ఆమె ఎంపికైంది.
ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ బాబు, శ్రీనువైట, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ కాంబినేషన్లో 'దూకుడు' వంటి సూపర్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆగడు చిత్రాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.