Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మంచు లక్ష్మి పాలిటిక్స్: మొన్న మోడీ, ఇపుడు తమ్ముడు!
హైదరాబాద్: మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మి తెలివిగా ముందుకు సాగడమే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈవిడ ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా....రాజకీయాలకు సంబంధించని అంశాలపై తనదైన రాజకీయం చేస్తోంది.
కొన్ని రోజుల క్రితం మొడీ హైదరాబాద్ రావడంతో స్వయంగా వెళ్లి కలిసిన మంచు లక్ష్మి....ఆయనకు తన మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరుతుందనే వార్తలు వచ్చాయి. అయితే తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని, మోడీకి మాత్రం తన సపోర్టు ఉంటుందని స్పష్టం చేసింది.
తాజాగా మంచు లక్ష్మి విజయవాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేస్తున్న దేవినేని అవినాష్తో దిగిన ఫోటోను తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది. 'నా తమ్ముడు దేవినేని అవినాష్ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తుండటం గర్వంగా ఉంది' అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.
అవినాష్తో...
విజయవాడ
కాంగ్రెస్
పార్టీ
ఎంపీ
అభ్యర్థి
దేవినేని
అవినాష్తో
మంచు
లక్ష్మి.
నరేంద్ర మోడీతో...
ఆ
మధ్య
బీజేపీ
ప్రధాని
అభ్యర్థి
నరేంద్ర
మోడీని
కలిసిన
మంచు
లక్ష్మి.
మాస్టర్ ప్లాన్
ఇలా
అన్ని
పార్టీల
వారితో
సత్సంబంధాలు
నెరపడం
ద్వారా
తన
భవిష్యత్తులో
జరిగే
పరిణామాలను
తనకు
అనుకూలంగా
మార్చుకునే
మాస్టర్
ప్లాన్తో
మంచు
లక్ష్మి
ముందు
సాగుతుందనే
అభిప్రాయం
పలువురు
వ్యక్తం
చేస్తున్నారు
నిర్మాత కోణంలో ఆలోచిస్తే..
సినిమా
రంగంలో
నిర్మాతగా
ఉన్న
వారికి
రాజకీయ
పార్టీలతో
మంచి
సంబంధాలు
ఉండటం
ఏదో
ఒక
సందర్భంలో
లాభిస్తుందని
అంటున్నారు.