Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
11న పూజ, మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ
హైదరాబాద్ : మహేష్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి ఊరిస్తున్న ఈ కాంబినేషన్ చిత్రం ఎట్టకేలకు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం వచ్చే నెల 11న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీస్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు.
వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవర్సీస్లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.
మహేష్బాబు మాట్లాడుతూ...కొరటాల శివ చెప్పిన స్టోరీలైన్ బాగుంది. మా కాంబినేషన్లో ఇది మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందడం ఆనందంగా వుంది అన్నారు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... దర్శకుడిగా నా రెండో చిత్రం సూపర్స్టార్ మహేష్బాబుతో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. మంచి అభిరుచివున్న నిర్మాతలు నవీన్, రవిశంకర్, సి.వి.ఎం. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. యూత్, ఫ్యామిలీస్, క్లాస్, మాస్ అందర్నీ ఆకట్టుకునే అంశాలు ఈ కథలో ఉన్నాయి. యూనివర్సల్ అప్పీల్ వున్న ఈ సబ్జెక్టు మహేష్బాబుకు వంద శాతం చక్కగా సూటవుతుంది. మహేష్బాబు ఫ్యాన్స్ మెచ్చే అన్ని ఎలిమెంట్స్ మిక్సయిన ఈ సినిమాలో మరెన్నో విశేషాలుంటాయని చెప్పారు.
నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం. మాట్లాడుతూ మా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్స్టార్ మహేష్బాబుతో చేయడం ఆనందంగా వుంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎంతో భారీఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ఈ చిత్రం మహేష్బాబు అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేలా వుంటుంది.
మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.