Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నితిన్ నెక్ట్స్...కొత్త డైరక్టర్ తో ఖరారు
నిర్మాత మాట్లాడుతూ... ''నితిన్కి ఇదో కొత్త కథ. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాము''అని నిర్మాత చెప్పారు. ఇక ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ కథ గత కొంత కాలంగా నితిన్ వద్ద, హీరో రామ్ వద్ద నలుగుతోంది. చివరికి నితిన్ తోనే ఫైనలైజ్ అయింది.
'ఇష్క్'తో ఫామ్ అందుకొన్న నితిన్.. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో మరోసారి మురిపించాడు. ఈ రెండు విజయాలతో ఈ యంగ్ హీరో కెరీర్ రాకెట్ వేగం అందుకొంది. ప్రస్తుతం 'హార్ట్ ఎటాక్', 'కొరియర్బోయ్ కళ్యాణ్' సెట్స్పై ఉన్నాయి. ఈలోగా కొత్త సినిమాలూ ఒప్పుకొంటున్నారు. ఇప్పుడాయన ఈ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు.
ఇక 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' దర్శకుడు మేర్లపాక గాంధీతో రామ్ కి అనుకున్న ప్రాజెక్టు సైతం ఇప్పుడు నితిన్ వద్దకు చేరిందని ఫిల్మ్ నగర్ సమాచారం. కథల ఎంపికలో డైలమాలో ఉన్న రామ్ ...'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' హిట్టవగానే చిత్ర దర్శకుడు గాంధీని పిలిచి కథ వినటం జరిగింది. అంతా ప్రాజెక్టు ఖరారు అవుతుంది,రామ్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందనుకున్నారు. కానీ కథలో రామ్ చెప్పిన మార్పులు,చేర్పులు చెయ్యటం కన్నా హిట్ లలో ఉన్న హీరో నితిన్ తో వెళ్లటం బెస్ట్ అని దర్శకుడు నిర్ణయం తీసుకుని జంప్ అయిపోయినట్లు చెప్తున్నారు.
మరో ప్రక్క మహిళా దర్శకురాలు బి.జయ ఆ మధ్యన ఓ స్క్రిప్టుని హీరో సునీల్ కోసం రెడీ చేయించింది. పూర్తి ఫన్,కొద్దిగా యాక్షన్ తో సాగే ఆ స్క్రిప్టుని సునీల్ చేస్తానని మాట ఇచ్చి నెలలు తరబడి గెంటుకు వస్తున్నాడు. దాంతో రీసెంట్ గా నితిన్ ని కలిసిన బి.జయ నేరేట్ చేయటం జరిగిందని, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే నితిన్ కూడా వరసగా సినిమాలు చేస్తున్నాడు. మరి డేట్స్ ఎలా కేటాయిస్తాడో చూడాలంటున్నారు.
ఇక పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'హార్ట్ఎటాక్' విడుదలకు సిద్దంగా ఉంది. నితిన్, అదాశర్మ జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. చిత్రాన్ని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''పూరి జగన్నాథ్గారితో ఓ మంచి సినిమా చేయాలన్న కోరిక నెరవేరింది. 'హార్ట్ఎటాక్' చిత్రం నా ప్రయాణానికి మేలి మలుపు అవుతుంది''అన్నారు నితిన్. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్లక్ష్మణ్, సమర్పణ: లావణ్య.