Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్కు కోర్టు తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆయనకు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తునప్నాయి.
'నరసింహుడు' కథ ఇస్తానని చెప్పి నిర్మాత చెంగల వెంకట్రావ్ వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. సమయానికి కథ అందించక పోవడంతో పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే బకాయి పడ్డ డబ్బు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో యలమంచిలి కోర్టులో నిర్మాత వెంకట్రావ్ కేసు దాఖలు చేశారు. దీంతో విజయేంద్ర ప్రసాద్కు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
పూర్తి
వివరాలు
ఇవీ...
నిర్మాత
చెంగల
వెంకట్రావ్
కొన్నాళ్ల
క్రితం
విజయేంద్ర
ప్రసాద్పై
పోలీస్
అధికారులకు
ఫిర్యాదు
చేశారు.
సినిమాకు
కథ
ఇస్తానంటూ
తన
వద్ద
రూ.41లక్షలు
తీసుకున్నారనీ,
తర్వాత
కథ
విషయం
పక్కనపెట్టేశారని
ఫిర్యాదులో
పేర్కొన్నారు.
తాను
2005లో
మరో
రచయిత
వద్ద
కథ
తీసుకుని
'నరసింహుడు'
పేరుతో
సినిమా
విడుదల
చేశానని
చెప్పారు.
పోలీసులకు చెబుతానంటే... అరెస్టుకు భయపడి రూ.30లక్షల విలువైన రెండు చెక్కులు ఇచ్చారని, వాటిని బ్యాంకులో జమచేస్తే తగినన్ని నగదు నిల్వలు లేవంటూ డబ్బులు ఇవ్వలేదని వివరించారు. దీంతో, తాను సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా... కేసునమోదు చేశారనీ, విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై నాన్బెయిలబుల్ వారెంటు జారీచేసిందని చెప్పారు. యలమంచిలి కోర్టులోనూ విజయేంద్ర ప్రసాద్ పై చెక్బౌన్స్ కేసు పెండింగులో ఉండటంతో తాజాగా ఆ కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ఇక 2011 లోనూ సినిమాకు స్క్రిప్ట్ సిద్దం చేస్తానని చెప్పి విజయేంద్ర ప్రసాద్, నిర్మాత మేడికొండ మురళి వద్ద ఏడెనిమిది సంవత్సరాల క్రితం సుమారు 6-7 లక్షల రూపాయలు తీసుకుని వివాదంలో ఇరుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ ఏ పనీ చేయక పోయినప్పటికీ, తీసుకున్న సొమ్ము సైతం తిరిగి ఇవ్వలేదని మేడికొండ మురళి ప్రధాన ఆరోపణగా అప్పుడు తెలిసిందే.