Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు ఐటం సాంగ్, బాక్సాఫీసు వద్ద బోల్తా (ఫోటోలు)
హైదరాబాద్: బ్యాగ్రౌండ్ అంతా మహేష్ బాబు ఫోటోలు, మహేష్ బాబును పొగుడుతూ హాట్ అండ్ సెక్సీగా హీరోయిన్ నిషా కొఠారి ఐటం సాంగ్. ఇదంతా ఈ మధ్య టీవీల్లో హల్ చల్ చేస్తున్న 'నువ్వే నా బంగారం' సినిమా ట్రైలర్. సాయికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ, బిందాస్ ఫేం షీనా హీరోయిన్ గా నటించిన సినిమా 'నువ్వే నా బంగారం'.
రామ్ వెంకీ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని పి. కృష్ణంరాజు నిర్మించారు. యాజమాన్య సంగీతం అందించిన ఈ చిత్రం మర్చి 7న విడుదలైంది. మహేష్ బాబు పేరుతో ఐటం సాంగు ఉండటం ద్వారా థియేటర్లు జనాలు పరుగెత్తుకొస్తారని అనుకున్నారో? ఏమో? తెలియదు కానీ...ఈ ఒక్క పాటతోనే ప్రచార కార్యక్రమాల అదరగొట్టారు నిర్మాతలు.
అయితే మహేష్ బాబు పేరుతో ఐటం సాంగు చేసినా పెద్దగా ఫలితం లేక పోయింది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
కథేంటి?
సూర్య (సాయికృష్ణ) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి. తన కాళ్లమీద తాను నిలబడాలనుకొనే మనస్తత్వం కలవాడు. స్వేచ్ఛగా బతకడం అంటే ఇష్టం. అందుకే ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటాడు. హారిక (షీనా) ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అమ్మానాన్న అంటే గౌరవం. 'మీరు చూపించిన అబ్బాయినే పెళ్లిచేసుకొంటా' అని ఇంట్లోవాళ్లకు మాటిస్తుంది. కానీ అనుకోకుండా సూర్య, హారిక ప్రేమలో పడతారు. ఆ తరవాత ఏమైంది? సూర్య, హారిక ఇద్దరూ తల్లిదండ్రుల మాట తప్పారా? స్వేచ్ఛను దుర్వినియోగం చేశారా? అనేది తెరపై చూడాలి.
కాన్సెప్టు ఇదీ..
ప్రేమని, కెరీర్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. జీవితం బాగుండాలంటే రెండూ లైట్ తీసుకోకుండా ముందుకు సాగాలి. అదే సమయంలో తల్లిదండ్రులకు పిల్లలపై నమ్మకం ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలు బంగారంలానే కనిపిస్తారు. పిల్లలకూ వాళ్ల తల్లిదండ్రులు బంగారమే. అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
నటీనటుల
శ్రీధనలక్ష్మి మూవీస్ సంస్థపై నిర్మించిన ఈ చిత్రంలో సాయికృష్ణ, షీనా, నిషాకొఠారి, సుమన్, తనికెళ్ల భరణి, సన, రాజశ్రీ నాయర్, ప్రవీణ్, శ్రావణ్, మహేశ్వరి తదితరులు నటించారు.
ఇతర వివరాలు
ఈ చిత్రానికి కథ, మాటలు: లంకపల్లి శ్రీనివాస్, ఛాయాగ్రహణం: రామ్. సంగీతం: యాజమాన్య నిర్మాత: పేరిచర్ల కృష్ణంరాజు దర్శకత్వం: రామ్ వెంకీ