Don't Miss!
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ తో మూడు చేసాం...గర్వ పడుతున్నాం
హైదరాబాద్ :" సూపర్ స్టార్ మహేష్ తో మూడు సినిమాలు..మూడు సంవత్సరాల వ్యవధిలో చేసాం... అందుకు గర్వపడుతున్నాం. మా సూపర్ స్టార్ పదిహేనేళ్ల జర్నిలో మూడు సినిమాలు మాతోనే.. ." అంటున్నారు ప్రముఖ నిర్మాత రామ్ ఆచంట. మహేష్ హీరోగా ఆయన 14 రీల్స్ బ్యానర్ పై దూకుడు, 1 నేనొక్కడినే, ఇప్పుడు ఆగడు చిత్రాలు చిత్రాలు నిర్మించారు. దాంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతున్న ఆగడు చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం బిజనెస్ కూడా బాగా జరుగుతోందని వినికిడి. దాంతో ఉత్సాహంగా ఉన్నారు నిర్మాతలు. 1 నేనొక్కడినే చిత్రంతో వచ్చిన లాస్ ని ఆగడు తో రికవరి చేసుకోబోతున్నారు.
మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలందిస్తున్నారు.
పంచ్ డైలాగు లేకపోతే.. టీజర్, ట్రైలర్ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్లు పేలుతున్నాయి. అయితే మహేష్బాబు మాత్రం పంచ్లపైనే పంచ్ వేసేశాడు.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.