Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
40 రోజులు రామానాయుడు స్టూడియోలోనే రామ్ చరణ్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో, శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో నిర్మిస్తున్న చిత్రం యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరారు.
ఏప్రిల్ 21 నుండి హైదరాబాద్లో రామానాయుడు సినీ విలేజ్ లోని హౌస్ సెట్లో ప్రధాన తారాగణం అంతా నటించే భారీ షెడ్యూల్ దాదాపు 40 రోజులు జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా వస్తున్న ఈ చిత్రానికి 'గోవిందుడు అందరి వాడేలే' అనే టైటిల్ ఖరారు చేయడంతో అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో భారీగా అంచనాలు పెరిగాయి.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'మా చిన్న బాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం పిబ్రవరి 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి కన్యాకుమారి, పొలాచ్చిలోని చక్కటి లొకేషన్స్లో షూటింగ్ జరుపుకున్నాము. ఏప్రిల్ 21 నుండి హైదరాబాద్లోని రామానాయుడు సినీ విలేజ్లోని హౌస్ సెట్లో ప్రధాన తారాగణం అంతా పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరిస్తారు అన్నారు.
ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల జరుగుతుంది. దీని తరువాత ఫారిన్లో సాంగ్స్ చిత్రీకరణ జరుగుతుంది. రామ్ చరణ్, కాజల్, రాజ్ కిరణ్, శ్రీకాంత్ కాంబినేషన్లో చిత్రీకరించిన సన్నివేశాలు సూపర్బ్ గా రావడమే కాక ఎంటర్టెన్మెంట్ గా ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. శ్రీకాంత్ కి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నారు అన్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టెనర్గా తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమీరా రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.