Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కృష్ణ వంశీ చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టర్,లుక్
హైదరాబాద్: రామ్ చరణ్, వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ మూవీ రూపొందుతున్నన్న సంగతి తెలిసిందే. కృష్ణ వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎన్నారై అని తెలుస్తోంది. యు.ఎస్ నుంచి వచ్చిన ఆధునిక భావాలు ఉన్న కుర్రవాడుగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోనీ టెయిల్ తో స్లిమ్ లుక్లో సరికొత్తగా కనిపించనున్నారు. కృష్ణ వంశీ తనదైన స్టైల్లో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం పొల్చాచిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్పై నిర్మిస్తున్నారు.
కృష్ణవంశీ. ఆయన మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ప్రారంభం జరిగింది. తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- 'క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, కుటుంబ భావోద్వేగాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారని, రామ్చరణ్ కెరీర్లో సరికొత్త పాత్రగా నిలిచే ఈ సినిమాలో కాజల్ మరోసారి ఆయనతో జతకట్టనుందని, ఇదే కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం 'మగధీర' తరువాత అంత విజయం సాధిస్తుందని తెలిపారు. రాజ్కిరణ్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జి ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారని, ఈ షూటింగ్ మూడు రోజులపాటు హైదరాబాద్లో, ఆ తరువాత 40 రోజులపాటు రామేశ్వరం, నాగర్కోయిల్, పొల్లాచ్చిలో చేస్తామని' అన్నారు.
ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.