Don't Miss!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగా హీరో చిత్రానికి ఎనర్జిటిక్ హీరో వాయిస్
హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' . షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం మే 9 న విడుదల చేయాలని దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి నిర్ణయించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి ఎనర్జిటిక్ హీరో రామ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైవిఎస్ చౌదరి కోరడంతో వెంటనే వచ్చి వాయిస్ ఇచ్చారు రామ్. గతంలో రామ్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' చిత్రంతోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్లో కొంత భాగం, హైదరాబాద్లో అత్యధిక భాగం షూటింగ్ చేశారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. నరేశ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్రెడ్డి, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, రఘుబాబు, హేమ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్.