Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రంభపై కేసు వెనక బంగారు నగల వ్యవహారం!
హైదరాబాద్: సినిమా హీరోయిన్ రంభపై వరకట్నం వేధింపులకు సంబంధించిన కేసు నమోదు కావడం ఆమె అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు 498 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసారు.
అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారంటూ పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో భర్త శ్రీనివాస్తో పాటు ఆడపడుచు రంభ, ఆమె తల్లిదండ్రులపై కూడా పల్లవి ఆరోపణలు చేసారు. అయితే రభ సోదరుడు శ్రీనివాస్ మాత్రం పల్లవి ఆరోపణలను ఖండించారు. పల్లవి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసారు.
పల్లవి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందని, ఆమె కుటుంబ సభ్యులే ఆమెతో ఇలా చేయిస్తున్నారని, తమ పరువు బజారుకీడ్చడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. రంభపై ఆరోపణలు చేస్తే సహించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రంభపై కేసు పెట్టడం వెనక నగల వ్యవహారం ఉన్నట్లు శ్రీనివాస్ వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. 'పల్లవి అక్కకి ముంబైలో గోల్డ్ బిజినెస్ ఉంది. ఆమె షాపులో నగలు ప్రదర్శన కోసం రంభ నగలను తీసుకెళ్లింది. మళ్లీ అడిగితే ఎంతకూ తీసుకురాలేదు. చాలా కాలం తర్వాత నగలు మా ఇంటికి పంపకుండా హైదరాబాద్ పంపారు. పల్లవి వెళ్లి ఆ నగలు తీసుకొచ్చారు. అనుమానం వచ్చి చెక్ చేస్తే అవి నకిలీ నగలు అని తేలింది. ఇలా ఎందుకు చేసారు అని అడిగితే....మాపై వరకట్నం వేధింపులు అంటూ తప్పుడు కేసు పెట్టారు' అని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రంభకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. మా పెళ్లయి 15 సంవత్సరాలయింది. కట్నం కోసం వేధించాల్సిన అవసరం నాకు లేద అని శ్రీనివాస్ తెలిపారు.