Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంత...నిజం అదేనంట
హైదరాబాద్ : స్టార్ హీరోయిన్స్ సాధారణంగా అప్ కమింగ్ హీరోల సరసన చేయటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే అల్లుడు శీను చిత్రంలో సమంత అలాంటి సాహసం చేసింది. కొత్త హీరో సనసన ఆమె నటించి ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరూ ఎక్కువ రెమ్యునేషన్ ఆఫర్ చేయిటంతో చేసారన చెప్పుకున్నారు. అయితే ఆ విషయం కాదంటూ ఆమె మీడియాతో మాట్లాడారు.
సమంత మాట్లాడుతూ... 'నాగచైతన్య', 'మహేష్బాబు', 'పవన్ కల్యాణ్', 'ఎన్టీఆర్' లాంటి వారితో కలిసి చేసిన నేను 'అల్లుడు శీను'లో నిర్మాత బెల్లంకొండ సురేష్ వాళ్ల అబ్బాయితో కలిసి నటించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. దానికీ కారణం ఉంది.
నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నాకెంతో ధైర్యాన్నిచ్చారు. అప్పుడు ఆయన నిర్మాణంలో 'జబర్దస్త్' చేస్తున్నా. 'నువ్వు పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ రామ్మా' అంటూ ఎంతో ధైర్యం చెప్పారాయన. కృతజ్ఞతగా ఆయన కోసం ఏదయినా చేయాలనుకున్నా. అందుకే 'అల్లుడు శీను'లో నటించా. త్వరలో రభస రానుంది అన్నారు.
సమంత మాట్లాడుతూ.... నేను చేసిన వాటిల్లో తెలుగు సినిమాలే ఎక్కువ. భాష నేర్చుకోకుండా నటిస్తుండటం తెలుగు ప్రేక్షకులను కించపరిచినట్లు అనిపించింది. పైగా నా చుట్టూ తెలుగువారే. అందుకే తెలుగు మాట్లాడటం నేర్చుకున్నా. ఎక్కడికెళ్లినా తెలుగులోనే మాట్లాడటం అలవాటు చేసుకున్నా. ఇప్పుడు అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నా. డబ్బింగ్ చెప్పే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా అని చెప్పారామె.