Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ యాడ్(ఫొటో)
హైదరాబాద్ : శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రన్ రాజా రన్''. ఈ చిత్రం వచ్చే నెల 1న చిత్రం విడుదలవుతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాతలు పేపరు యాడ్ ఇచ్చారు. థియోటర్స్ లిస్ట్ కూడా వచ్చేసింది. దర్శకుడు సుజీత్ ఇంటర్వూలు కూడా మీడియాలో వచ్చేసాయి. సుజీత్ 'రన్ రాజా రన్' ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
సుజీత్ మాట్లాడుతూ.... ''ఇప్పటివరకు 40 లఘుచిత్రాలు తెరకెక్కించాను. ఆ అనుభవంతోనే ఈ కథను రాసుకొని వంశీ, ప్రమోద్లను సంప్రదించాను. ఈ కథ రాయడంలో ఓ గమ్మత్తు ఉంది. నేను చేసిన ఓ లఘుచిత్రం పేరు 'రన్ రాజా రన్'. ఆ పేరు నచ్చి దానిఆధారంగానే కథ రాసుకున్నాను. సినిమా మొదలు పెట్టాక శర్వానంద్కి, సినిమాకి ఈ పేరు సరిగ్గా కుదిరింది. సత్యహరిశ్చంద్రుడు లాంటి కుర్రాడు కథ ఇది. ఎప్పుడూ నిజాలు చెప్పే అలవాటు వల్ల ప్రేమలో విఫలమవుతుంటాడు. ఇదే సమయంలో ఓ నేరంలో ఇరుక్కుంటాడు. దాని నుంచి ఎలా బయటపడ్డాడనేదే సినిమా'' అన్నారు.
అలాగే పాటల గురించి చెప్తూ... ''కమల్హాసన్తో వరుస సినిమాలు చేస్తున్న జిబ్రాన్ ఈ సినిమాకు స్వరాలందించారు. పాటలు విన్నవారందరూ కొత్త తరహాలో ఉన్నాయి అంటున్నారు. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది'' అన్నారు సుజీత్.
జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. ప్రభాస్ హీరోగా తొలి యత్నంలోనే 'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన యు.వి. క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ తమ రెండో చిత్రం కావటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది.
లవ్, కామెడీ ఎంటర్టైనర్గా 'రన్ రాజా రన్' రూపొందుతోంది. ఇందులో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. కథకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో కథకు అవసరమైన పాత్రలే ఉంటాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో దీన్ని నిర్మిస్తున్నారు.
అడివి శేష్, సంపత్, జయప్రకాశ్రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం., ఛాయాగ్రహణం: మధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.