Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫేసు బుక్ సాక్షిగా సమంత కన్నీరుపెట్టేసుకుంది
హైదరాబాద్: మిగతా హీరోయిన్స్ లా కాకుండా సమంత ఎప్పుడూ ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో తన ఫ్యాన్స్ తో బిజీగా ఉంటూ మోడ్రన్ హీరోయిన్ అనిపించుకుంటూంటుంది. ఆమె పుట్టిన రోజు ఏప్రియల్ 28. అయితే ఆమె ఫ్యాన్స్ కొందరు వారం ముందు నుంచే ఈ పుట్టిన రోజుకు చెందిన హంగామా మొదలెట్టారు. ఆమెకు బహుమతులు పంపటంలో బిజీ అయ్యిపోయారు. అలాంటి ఓ వీరాభిమాని స్రవంతి..ఆమెకు పంపిన గిప్ట్ చూసి సమంత కన్నీటి పర్యంతమయ్యింది. ఆ విషయం ఆమె స్వయంగా తెలియచేసింది.
ఇంతకీ సమంతని అంత ఎమోషనల్ చేసిన ఆ అరుదైన బహుమతి ఏమిటీ అంటే.. ఓ పుస్తకం. సమంత గురించి రాసిన ఆ పుస్తకంలో తాను సమంతను ఎందుకు అంతలా ఇష్టపడుతోందో నాలుగు కారణాలు రాసిందిట. అవి చదివగానే ఆమెకు కన్నీరు వచ్చేసింది చెప్తోంది. ఈ విషయమై ఆమె తన అభిమానులతో షేర్ చేసుకుంది.
తెలుగు, తమిళంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న నటి సమంత. నిన్నటి వరకు తెలుగు పరిశ్రమలోనూ జోరు చూపిన ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం కోలీవుడ్లో సందడి చేస్తోంది. ఇప్పటికే విజయ్కు జంటగా 'కత్తి', సూర్యతో 'అంజాన్'లో నటిస్తోంది.
విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రంకు జోడీగానూ ఎంపికైంది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తుండటంతో పారితోషికాన్ని పెంచాలనే యోచనలో ఉందట. త్వరలోనే దీనికి సంబంధించిన డిమాండ్ బయటపడే అవకాశముందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే సమంతను పెట్టుకుంటే బిజినెస్ కూడా వెంటనే అయిపోతుందని భావిస్తున్నారు.
గతేడాది ఆరు సినిమాలతో బిజీబిజీగా గడిపిన సమంత ఈ ఏడాది కూడా ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది చిత్రంతో కలిసి చేసిన దర్శకుడు త్రివిక్రమ్ తో మరోసారి పనిచేయటానికి సైన్ చేసి వార్తల్లో నిలిచింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ఆమె డేట్స్ ఇవ్వటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
త్రివిక్రమ్,అల్లు అర్జున్ గతంలో జులాయి చిత్రం చేసారు. ఈ సారి ఈ కొత్త చిత్రం కూడా అదే స్ధాయిలో యాక్షన్..ఎంటర్టైన్మెంట్ కలిపి ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వార్తల్లోకి వచ్చినా ఆ అదృష్టం సమంతనే వరించింది. అలాగే ఈ చిత్రానికి ఎప్పటిలాగే దేవిశ్రీప్రాసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మురెళ్ళ కెమెరా వర్క్, జులాయి నిర్మాత రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సమంత మాట్లాడుతూ....''ఈ ఏడాది కూడా వరుస షూటింగ్ లతో తీరిక లేకుండా గడపబోతున్నాను. 'ఆటోనగర్ సూర్య', 'మనం'తోపాటు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా, ఎన్టీఆర్తో మరో సినిమా చేస్తున్నాను. తమిళంలో సూర్యతో 'అంజాన్' చేస్తున్నాను. ఇవన్నీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫలితం ఎలా ఉంటుందో అని కాస్త కంగారుగా ఉంది. అయితే లోలోపల ఈ అవకాశం నాకే వచ్చిందనే ఉద్వేగం కూడా ఉంది'' అని పేర్కొంది సమంత.
అలాగే ...''ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో... ఈ జన్మలో ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాను. నా తొలి సినిమా నుంచి నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. నా మంచి, చెడుల విషయంలో సొంత మనిషిలా ఆదరిస్తున్నారు. మీ అండతోనే నేనీ స్థాయికి చేరుకున్నాను. నా జీవితంలో అభిమానులు ఉంటే చాలు... ఇంకేమీ అక్కర్లేదు'' అంటోంది సమంత.