Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ వర్సెస్ పవన్ : ఆన్లైన్లో రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెం.1 స్థానం కోసం పోటీ పడుతున్న హీరోలు ఇద్దరే ఇద్దరు మహేష్ బాబు, పవన్ కళ్యాన్. వాళ్లకి ఈ నెంబర్ గేమ్పై ఆసక్తి లేక పోయినా....ఫ్యాన్స్ మాత్రం తమ తమ హీరోలను నెం.1 స్థానంలో చూసుకోవాలని ఆశ పడుతున్నారు. ఇందుకోసం తమకు చేతనైనా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరి అభిమాన హీరో వారికి గొప్ప అనేది కాదనలేని సత్యం. త్వరలో సౌత్ ఇండియన్ ఇంటర్ నేషనల్ మూవీ అవార్డు(సైమా)ల ప్రకటన జరుగనున్న నేపథ్యంలో.....మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆన్ లైన్లో రెచ్చిపోతున్నారు. పోటీ పడి తమ తమ హీరోలను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవార్డుల ఎంపికలో కీలకమైన ఆన్ లైన్ ఓటింగులో పాల్గొంటున్నారు.
ఈ అవార్డుల జ్యూరీ లిస్టులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఉత్తమ నటుడి కేటగిరిలో పోటీ పడుతున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రానికిగాను పవన్ కళ్యాణ్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికిగాను మహేష్ బాబు నామినేట్ అయ్యారు. అవార్డుల ఎంపికలో ఆన్ లైన్ ఓటింగ్ కీలకం.
ఆన్ లైన్ ఓటింగ్ ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే 4,30,000 ఓట్లు ఉత్తమ నటుడి ఎంపిక కోసం రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. వీటిలో అత్యధిక ఓట్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకే పడ్డాయి. ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) కార్యక్రమం ఈ ఏడాది మలేషియాలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈఅవార్డుల కార్యక్రమం జరుగనుంది.