Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఛార్మి కి పదిరూపాయలు ఎందుకు ఇచ్చాడు? (ఫొటో)
హైదరాబాద్ : ఛార్మికి దర్శకుడు ఓ పదిరూపాయలు నోటు ఇచ్చాడట. ఈ విషయాన్ని ఆమె చూపుతూ ఫోటో దిగి ట్టిట్టర్ లో పెట్టి...ఆ పది రూపాయలు ఎందుకు ఇచ్చారో అర్దం కావటం లేదు అంది. ఆమె ట్వీట్ చేస్తూ " నా మంత్ర 2 డైరక్టర్ దీన్ని ఇచ్చాడు. ఇది షాక్ కి ఇచ్చిందా ?? ఎందుకంటే షాట్ బాగా చేసానని ??లేక తన తదుపరి చిత్రం ప్రమేషన్ కి ఇచ్చాడా??" అంటూ డౌట్ ఎక్సప్రెస్ చేసింది. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తూందని ఫిల్మ్ సర్కిల్స్ లో వాళ్లు అంటున్నారు.
చార్మి కథానాయికగా తేజ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న 'మంత్ర-2' రెగ్యలర్ షూటింగ్ జరుగుతోంది. కె.పద్మ సమర్పణలో బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్.వి.సతీశ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. చార్మి ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నటిస్తున్నారు.
సస్పెన్స్, హారర్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కనుక రాత్రి సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్క్ చేస్తున్నాం. ఈ విషయంలో మా కథానాయిక చార్మి అందిస్తున్న సహకారాన్ని మరువలేం. 'మంత్ర' సినిమాకి ఇది సీక్వెల్ కాదు కానీ ఒకరకంగా సీక్వెల్ లాంటిదే. ఆ సినిమా కంటే మరింత బాగా రావడం కోసం అందరూ కృషి చేస్తున్నారు. ఈ నెల మూడోవారం నుంచి రామోజీఫిలిం సిటీలో ఏకధాటిగా జరిగే షూటింగ్తో చిత్రం పూర్తవుతుంది' అన్నారు.
దర్శకుడు సతీశ్ మాట్లాడుతూ 'ఇండియన్ స్క్రీన్మీద ఇలాంటి స్థాయిలో ఏ హారర్ చిత్రం రాలేదని కచ్చితంగా చెప్పగలను. అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది.అలాగే సీక్వెల్లో ఇంతవరకూ ఏ హీరోయిన్ నటించలేదు. ఆ ఘనత మా హీరోయిన్ చార్మీకే దక్కుతుంది. సినిమాలో రెండే రెండు పాటలు ఉంటాయి. సంగీత దర్శకుడు శివశంకర్ వాటికి అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు' అని తెలిపారు.
తనికెళ్ల భరణి, రాహుల్దేవ్, రావు రమేశ్, నల్ల వేణు, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివశంకర్, ఫొటోగ్రఫీ: ఆర్.పి.తనికెళ్ల, ఎడిటింగ్: బాబు సిద్దంశెట్టి, కొరియోగ్రఫీ: ప్రేమ్రక్షిత్, కళ: పి.ఎస్.వర్మ, సహ నిర్మాతలు: పవన్, సురేశ్ కొండవీటి, రచన, దర్శకత్వం: ఎస్.వి.సతీశ్.