Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఉదయ్ కిరణ్ ఆఖరి మూవీ ‘చిత్రం చెప్పిన కథ’ టీజర్
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ విడుదల చేసారు
దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమాకు ఉదయ్ కిరణ్, మున్నా, స్క్రిప్ట్ రైటర్ నరేష్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్కి నివాళి ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ 'ఈ సినిమా చక్కని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. కచ్చితంగా సినిమా హిట్టై ఉదయ్ కిరణ్ కి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది. తను మన మధ్య లేకపోవడం బాధాకరం. టీజర్ చాలా బాగుంది. మున్నాకాశీ మంచి సంగీతం ఇచ్చాడు అన్నారు.
ఉదయ్ చేతుల మీదుగా టీజర్ విడుదలచేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఈ నెల చివర్లో ఆడియో రిలీజ్ చేసి వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీడైమన్షన్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, దేవీప్రసాద్, కాదంబరి కిరణ్, సంగీత దర్శకుడు మున్నా కాశీ, నిర్మాత కాశీ, దర్శకుడు మోహన్ ఏయల్లార్కే పాల్గొన్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/xsTKBrBE5Ak?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>