Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అశ్లీలంగా చిత్రీకరించారు: పోలీసులకు ఉదయభాను కంప్లైంట్
హైదరాబాద్: పాపులర్ యాంకర్ ఉదయభాను తొలిసారిగా హీరోయిన్గా నటిస్తున్న చిత్రం 'మధుమతి'. గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ నిర్మించారు. ఉదయభాను ఇందులో వేశ్య పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'మధుమతి' చిత్ర దర్శక నిర్మాతలపై ఉదయభాను ఫిర్యాదు చేసారు. తన పాత్రను అశ్లీలంగా చిత్రీకరించినట్లు ఉదయభాను సీసీఎల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
కాగా....అగ్రిమెంటు ప్రకారం తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా చెల్లించక పోవడం కూడా మరో కారణమని తెలుస్తోంది. తాను షూటింగుకు సరిగా హాజరు కాలేదని దర్శక నిర్మాతలు ప్రచారం చేస్తుండటంపై కూడా ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్.
సినిమాలో ఓ స్పెషల్ సాంగు విషయంలో ఉదయభాను హాజరు రాక పోవడం వల్లే వేరే వారితో చిత్రీకరించినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్లో కీలకమైన ఆడియో ఫంక్షన్కు కూడా ఉదయభాను డుమ్మా కొట్టిందని గుర్రుగా ఉన్నారు నిర్మాతలు. అయితే తాను హాజరైనప్పటికీ వేరే నటితో చిత్రీకరించారని ఉదయభాను వాదిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి 'మధుమతి' సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాల్లో ఇరుక్కుంది. ఇటు ఉదయభాను, అటు దర్శకనిర్మాతల మా మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పరస్పరం ఫిర్యాదు చేసుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చూడాలి.