Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘మధుమతి’ వివాదం: ప్రెస్ మీట్లో ఏడ్చేసిన ఉదయభాను
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను హీరోయిన్గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'మధుమతి'. అయితే తన పాత్రను ఈచిత్రంలో అభ్యంతరకరంగా చూపించారని ఉదయభాను ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేసారు. తాజాగా ఉదయభాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఫిల్మ్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉదయభాను మాట్లాడుతూ.....తన ఫోటోలు మార్పింగ్ చేసారనే అనుమానంతో పోలీసులను ఆశ్రయించి వారి సహాయంతో గురువారం రాత్రి సినిమా చూసానని, నా అనుమానమే నిజమైందని....తనకు చెప్పిన కథ వేరు, సినిమాలో నా పాత్రను చూపించిన విధానం వేరుగా ఉంది. అశ్లీలంగా చూపించారు అని ఆమె వాపోయారు. సినిమాలోని కొన్ని సీన్లు మార్ఫింగ్ చేసారని ఆమె ఆరోపించారు.
అయితే కొన్ని ఛానల్స్, వెబ్ సైట్లు తన బాధను అర్థం చేసుకోకుండా....నేను ఓవరాక్షన్ చేస్తున్నంటూ కథనాలు వెలువరిస్తున్నారని, ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే ఎవరికీ పట్టడం లేదు అంటూ ఉదయభాను కంటతడి పెట్టారు. తన పాత్రను అశ్లీలంగా చూపించడంపై ప్రశ్నిస్తే అనవసర రాద్దాంతం అంటారా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. పబ్లిసిటీ కోసమే ఈ వివాదానికి తెరలేపారనే అంశాన్ని ఉదయభాను ఖండించారు. తనకు పబ్లిసిటీ అవసరం లేదని, వాస్తవాలు వెల్లడించడానికే తాను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మధుమతి చిత్రాన్ని గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రంలో దీక్షాపంథ్, విష్ణు ప్రియన్, సీతా, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కడియం రమేష్, కె. రాణి శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు.