Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వీక్ కాదు: రామ్ చరణ్ సినిమాపై వెంకీ కామెంట్
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాలో వెంకటేష్ను ఎంపిక చేసారు. కానీ ఉన్నట్టుండి వెంకటేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. దీంతో ఆ పాత్రకు శ్రీకాంత్ను ఎంపిక చేసారు.
అయితే వెంకీ సినిమా నుండి తప్పుకోవడంతో అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. స్ర్కిప్టు వీక్గా ఉండటం వల్లనే వెంకటేష్ తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్టు వీక్గా ఉందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు.
'నా ఇమేజ్కు తగిన విధంగా రోల్ లేక పోవడం వల్లనే నేను సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. యూనిట్ సభ్యులు కూడా అదే భావించారు. నా స్థానంలో వేరే యాక్టర్ను తీసుకోవాలనుకున్నారు. నాకైతే స్క్రిప్టు బాగా నచ్చింది. నా పాత్రలో ఇమడానికి ట్రై చేసాను' అని వెంకటేష్ తెలిపారు. 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం గొప్ప చిత్రం అవుతుందని వెంకటేష్ అంటున్నారు. విడుదలకు ముందే వెంకటేష్ ఈ సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ ఇవ్వడంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఆడియో ని ఆగస్టు 20న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే టీజర్ ని కృష్ణ వంశీ పుట్టిన రోజున అంటే ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి టాకి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.