Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ది గ్రేట్ డైరెక్టర్ కన్నుమూత, విషాదం
కొచ్చి: ప్రముఖ మళయాల దర్శకుడు జె శశికుమార్ కన్నుమూసారు. 86 ఏళ్ల శశికుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అతన్ని కొచ్చి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మరణించారు. శశికుమార్ మరణంతో మళయాల చిత్ర సీమలో విషాదం నెలకొంది.
మళయాల సినీ పరిశ్రమలో తొలి హిట్ మేకర్గా ఆయనకు పేరుంది. 1960 నుండి 70 మధ్య కాలంలో ఆయన పలు హిట్ చిత్రాలను తెరకెక్కించారు. శశికుమార్ అసలు పేరు నంబియాతుసెరిల్ వార్కే జాన్. కేరళలోని అలపుజలో జన్మించారు. మళయాల చిత్ర సీమలో ఇప్పటి వరకు ఎవరూ చేయనన్ని సినిమాలు ఆయన తెరకెక్కించి రికార్డు సృష్టించారు. 141 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దీంతో పాటు ఒకే హీరోతో అత్యధిక సినిమాలో, ఒకే హీరోయిన్తో అత్యధిక సినిమాలు, ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాలు లాంటి రికార్డులు ఆయన సొంతం.
మళయాలం ఎవర్ గ్రీన్ యాక్టర్ ప్రేమ్ నజీర్ తో ఆయన ఏకంగా 84 సినిమాలు తీసారు. అదే విధంగా నటి శీలాతో 47 సినిమాలు చేసారు. ప్రేమ్ నజీర్, శశికుమార్ కాంబినేషన్లో సినిమా వచ్చిందే అది సూపర్ హిట్ అనే పేరుంది. మొదట్లో వాస్తవిక చిత్రాలు తీసిన శశికుమార్...ఆ తర్వాత ఎంటర్టెన్మెంట్, థ్రిల్లర్ మూవీస్ కూడా తెరకెక్కించారు. కేరళ ప్రభుత్వం గతేడాది ఆయన్ను జేసి డేనియల్ అవార్డుతో సత్కరించింది.