Don't Miss!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇది రావటానికి ఆరేళ్ళు పట్టింది : విశాల్
పందెం కోడి, భరణి, వాడు వీడు, వెంటాడు వేటాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్ తొలిసారి విశాల్ ఫిలింఫ్యాక్టరీని స్థాపించి స్వయంగా నిర్మించిన ద్విభాషా చిత్రం 'పల్నాడు'. 'నా పేరు శివ' ఫేం సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'గజరాజు' ఫేం లక్ష్మీమీనన్ హీరోయిన్.
విశాల్ అంటే పదిమందిని ఒక్కడే తంతాడు. ఇదీ జనాల్లో ఉన్న ఇమేజ్. దానికి దూరంగా చేసిన తొలి ప్రయత్నమిది. దాదాపు పదేళ్ల తర్వాత నా ఇమేజ్కి పూర్తి ఆపోజిట్ పాత్రలో కనిపిస్తున్నా. కొట్టాలంటే భయపడే కుర్రాడిగా ఈసారి కనిపిస్తున్నా. నా కెరీర్లో మర్చిపోలేని పాత్ర ఇది అన్నారు విశాల్.
అలాగే... ''ఇప్పటిదాకా హీరోగానే మాట్లాడాను. తొలిసారి నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఈ సినిమా వెనక చాలా కష్టం ఉంది. అదంతా ఇష్టంతోనే చేశాను. ప్రతీ హీరో జీవితంలోనూ ఓ మలుపు అనేది ఉంటుంది. అది దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ విన్నాక కూడా నాకు ఓ మంచి మలుపునిచ్చే చిత్రమవుతుందనిపించింది. నాలో ఆవేశం, సినిమాపై వున్న ప్రేమవల్ల నిర్మాతనయ్యాను. 'పల్నాడు' అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమైంది. ఇక తెలుగు సినిమా గురించి ప్రతీసారీ చెబుతూనే ఉన్నాను. నేను నిర్మాతగా మారడం వల్లే నా తెలుగు సినిమా ఆలస్యమైంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నా'' అన్నారు.
ఇక " ఎవరికైనా ఏదో ఒక సమయంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. సుశీంద్రన్ ఈ కథ చెప్పినప్పుడే ఇది అలాంటి కథ అనిపించింది. నా కెరీర్కు ఇది చాలా ముఖ్యమైన చిత్రం.ఇప్పటికే మా కుటుంబానికి ఓ బ్యానర్ ఉన్నప్పటికీ, ఈ సినిమా నిర్మాణాన్ని నేనే స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశంతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశాను. వచ్చే సంక్రాంతికి తెలుగులో శశి దర్శకత్వంలో ఓ స్ట్రయిట్ సినిమా చేయబోతున్నా'' అని చెప్పారు.