Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
Janaki Kalaganaledu July 28th: మాటలతో రామచంద్రను బాధపెట్టిన జ్ఞానాంబ.. ఊహించని సస్పెన్స్!
జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన అంశంతో మంచి రేటింగ్స్ అందుకుంటోంది. భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. దీంతో జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇక అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదని ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. అలాగే జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 354 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
సర్టిఫికేట్స్ కోసం
ఐపిఎస్ చదువులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకూడదు అని జానకి అనుకుంటుంది. ఇక భార్య కోసం రామ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జానకి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా తొడి కోడలు మల్లిక నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమెకు అనుకోకుండా ఒక చేదు అనుభవం కూడా ఎదురవుతుంది. మరోవైపు కోచింగ్ సెంటర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ కావాలని చెప్పడంతో అక్కడే సమస్య మొదలవుతుంది. గతంలోనే ఒకసారి జానకి తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా అత్తగారికి ఇచ్చేస్తుంది. మళ్ళీ చదువు అనే విషయం గురించి ఆలోచించనని మాట కూడా ఇస్తుంది. కానీ ఇప్పుడు జానకి ఆ సర్టిఫికెట్స్ ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో రామచంద్ర తండ్రి గోవిందరాజులు జానకికి సహాయం కూడా చేస్తాడు.
ఎమోషనల్ మూమెంట్
ఇక జానకి సర్టిఫికెట్స్ తీసుకొని తన కోచింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ సబ్మిట్ చేస్తుంది. ఇక అప్పుడే అక్కడ బెస్ట్ స్టూడెంట్స్ కు అవార్డులు ఇస్తూ ఉంటారు. ఇక అందులో జానకి కూడా సెలెక్ట్ అవుతుంది. ఆ సమయంలో జానకి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇదంతా తన భర్త వల్లే సాధ్యమైంది అని తన భర్త సహాయం లేకపోయి ఉంటే తను ఇక్కడి వరకు వచ్చే దాన్ని కాదు అని జానకి కంటతడి పెడుతూ చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న రామచంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతాడు. ఇక జానకి అలా మాట్లాడుతున్న సమయంలోనే అక్కడికి జ్ఞానాంబ కూడా వస్తుంది.
బాధలో జ్ఞానాంబ
జానకి
చదువును
కొనసాగిస్తుంది
అని
ప్రత్యక్షంగా
చూసిన
జ్ఞానాంబ
ఒక్కసారిగా
షాక్
అవుతుంది.
ఇక
తర్వాత
ఆమె
ఎవరికీ
తెలియకుండా
అలా
నడుచుకుంటూ
రోడ్డు
మీద
వెళ్లి
పోతుంది.
ఇక
ఆమె
కోసం
వెతుకుతూ
జానకి
రామచంద్ర
ఎన్నో
చోట్ల
తిరుగుతారు
మరోవైపు
ఇంటిదగ్గర
కుటుంబ
సభ్యులు
కూడా
జ్ఞానాంబ
ఎక్కడికి
వెళ్లిందో
అని
కంగారుపడుతూ
ఉంటారు.
ఈ
క్రమంలో
ఒక
చెరువు
గట్టు
దగ్గర
నిలబడి
ఉన్న
జ్ఞానాంబ
ఎంతో
బాధతో
ఉంటుంది.
ఇక
అక్కడికి
రామచంద్ర
జానకి
చేరుకుంటారు.
నాకు
తెలియకుండా
జానకి
మళ్ళీ
చదువును
కొనసాగిస్తుంది
అని
తెలిసిన
మరుక్షణం
నేను
చనిపోయాను
అని
జ్ఞానాంబ
బాధతో
చెబుతుంది.
ఇచ్చిన మాట కోసం
కానీ రామచంద్ర మాత్రం నేను నీకు ఇచ్చిన మాట కోసమే జానకిని చదివిస్తున్నాను అని చెబుతాడు. అప్పుడు జ్ఞానాంబ కూడా ఆశ్చర్య పోతుంది. నువ్వు గతంలో భార్యను ఏ మాత్రం కంటతడి పెట్టించకుండా తన అనుకున్న పనులన్నిటిలో కూడా సహాయపడాలి అని తన విజయంలో నువ్వు కూడా తోడుగా ఉండాలి అని చెప్పావు.. కదమ్మా.. అందుకే నేను జానకి చదువు విషయంలో నిర్ణయం తీసుకొని ఆమెను చదివించాను అని అంటాడు. కానీ జ్ఞానాంబ మాత్రం ఆమె చదువు విషయంలో ఎప్పుడూ కూడా అలా చెప్పలేదు అని చెబుతుంది.
అమ్మా అని పిలవద్దు
ఆ తరువాత జ్ఞానాంబ కొడుకుపై మరింత బాధతో ఉంటుంది. జానకి చదువు భవిష్యత్తులో నీకు ఏదైనా బాధ కలిగిస్తుందేమో అని భయంతోనే నేను ఇన్నాళ్లు ఆమెను చదువుకోవద్దు అని చెప్పాను. అయినప్పటికీ కూడా నన్ను మోసం చేసి ఇద్దరూ మీరు అనుకున్న పని చేశారు. మరోసారి నన్ను అమ్మ అని పిలవద్దు అని జ్ఞానాంబ కొడుకుకు చెబుతుంది. అంతే కాకుండా నువ్వు నా కడుపున పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను అని కూడా అంటుంది.
ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..
తల్లి కఠినమైన మాటలను విన్న రామచంద్ర ఏ మాత్రం తట్టుకోలేకపోతాడు. అంతే కాకుండా తల్లికి క్షమాపణ చెప్పి తనకు జీవించే అర్హత లేదని అంటాడు. అనంతరం రామచంద్ర ఆ చెరువుగట్టు లోపలికి వెళ్లి చనిపోవాలని అనుకుంటాడు. ఇక అప్పుడే జ్ఞానాంబ కొడుకుని పిలుస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు కానీ అక్కడ కూడా జ్ఞానాంబ ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుంటుంది. అనంతరం భర్త గోవిందరాజులు జ్ఞానాంబ బాధలో ఏమైనా చేసుకుంటుందేమో అని కంగారు పడుతూ ఉంటాడు. కానీ నేను అలాంటి పిరికి పనులు చేయను అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళుతుంది. మరి ఈ పరిణామాల్లో జ్ఞానాంబ కొడుకు కోడలిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.