Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
అమ్మాయి మోసం కేసు : '3జి లవ్' చిత్రం నిర్మాత అరెస్ట్
హైదరాబాద్ : విజయనగరానికి చెందిన కోలగట్ల ప్రతాప్ కుమార్ ని కరీంనగర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రతాప్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని సినిమా అవకాశాలు కలిపిస్తానని చెప్పి మోసగించినట్లు కరీంనగర్ కి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడుని విజయనగరంలో అదుపులో తీసుకుని కరీంనగర్ తరలించారు. ప్రతాప్ పై 417,420 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు.
వివరాల్లోకి వెళితే...కరీంనగర్ లో విద్యానగర్ కి చెందిన ఓ యువతి(24) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఫేస్ బుక్ లో విజయనగరానికి చెందిన కోలగట్ల ప్రతాప్ కుమార్(28)పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ తరుచూ హైదరాబాద్ లో కలుసుకునేవారు. కొంతకాలం పాటు సజావుగా సాగిన లవ్ స్టోరీ పెళ్లి దగ్గరకి వచ్చేసరికి మలుపు తిరిగింది. తనను వివాహం చేసుకోవాలని సదరు యువతి ఒత్తిడి చేయటంతో ప్రతాప్ కుమార్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతని గురించి విచారించగా అప్పటికే పెళ్ళై,రెండేళ్ల కుమారుడు ఉన్నట్లు ఆమెకు తెలిసింది.
దీంతో తనను మోసం చేసాడంటూ ఆమె ఈ నెల ఎనిమిదవ తేదీన కరీం నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రతాప్ పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం సాయింత్రం విజయనగరంలో ఉన్న ప్రతాప్ ని అదుపులో తీసుకుని కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు. చివరకు సదరు యువతి, ప్రతాప్ రాజీ కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే కేసు నమోదు అయినందున కోర్టులో రాజీ చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో వారు కోర్టుని ఆశ్రయించినట్లు సమాచారం.