Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షాకింగ్: సల్మాన్ ‘కిక్’ థియేటర్పై బాంబు దాడులు
కరాచీ: బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇండియాతో పాటు పాకిస్థాన్లోనూ విడుదలవుతాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ చిత్రాలకు అక్కడ మంచి ఆదరణ లభిస్తుంది. ఇటీవల ఈద్ సందర్భంగా విడుదలైన సల్మాన్ ఖాన్ 'కిక్' మూవీ పాకిస్తాన్లోనూ విడుదలైంది.
అయితే పాకిస్థాన్లో సల్మాన్ ఖాన్ 'కిక్' సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్లపై బాంబు(హాండ్ గ్రేనేడ్స్) దాడి జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి థియేటర్ గేటు వద్ద హ్యాండ్ గ్రేనేడ్స్ విసిరి వెళ్లి పోయారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. అయితే ఈ దాడికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
తెలుగులో సూపర్ హిట్ అయిన రవితేజ 'కిక్' చిత్రాన్ని బాలీవుడ్లో సల్మాన్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. సాజిద్ నడియావాలా ఈచిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకుడిగా సాజిద్ నడియావాలాకు ఇదే తొలి సినిమా. సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించింది.
ఈద్ పండగను పురస్కరించుకుని విడుదలైన ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన రోజు హిట్ టాక్ రావడంతో వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేసారు. కానీ అంతకంటే వేగంగా కేవలం నాలుగు రోజుల్లోనే ఈచిత్రం 100 కోట్ల వసూళ్లూ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం దాదాపు 5000 వేల థియేటర్లలో విడుదలైంది.