Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘నా బంగారు తల్లి’కి మూడు జాతీయ అవార్డులు
హైదరాబాద్: రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా బంగారు తల్లి' జాతీ అవార్డుల రేసులో తెలుగు సినిమా సత్తాను చాటింది. 2013 సంవత్సరానికిగాను జరిగిన జాతీయ అవార్డుల రేసులో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అంజలి పాటిల్ స్పెషల్ జ్యూరీ అవార్డు చేజిక్కించుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ...'జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. గతంలో ఇండోనేషియాలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెస్డ్ సినిమా ఆఫ్ ఫెస్టివల్, ట్రినిడి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు అనే అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నప్పటికీ ఇక్కడ సరైన గుర్తింపు రాలేదనే వెలితి ఉండేది. కానీ తాజాగా దక్కిన జాతీయ అవార్డుతో ఆ వెలితి తీరి పోయింది. ఈ ఆనందాన్ని పంచుకుందామనుకున్నప్పటికీ ప్రస్తుతం బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉండటం కారణంగా మీడియాతో ఈ ప్రకటన ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను' అన్నారు.
యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధంతో పాటు, నేడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజెప్పేదిగా ఉంటుందని తెలిపారు. సిద్ధిక్, అంజలి పాటిల్, నైనా కృపా తదితరులు నటించిన ఈ చిత్రానికి శాంతను మోయిత్రా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ తులసి, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్: డాన్ మాక్స్.
61వ జాతీయ సినిమా అవార్డుల వివరాల కోసం క్లిక్ చేయండి