Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కోసమే ఆ డ్రామా ఆడా:పూరీ
పూరి మాట్లాడుతూ... బద్రి తమాషా కథ. ఓ అబ్బాయి ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తాడు. నిజానికి ఈ కథ ఎవరికి చెప్పినా ఒప్పుకోరు. కానీ సరిగ్గా తీస్తే ప్రేక్షకులు నెత్తిమీద పెట్టుకొంటారని నాకు తెలుసు. అప్పటికి నాకు పవన్ కల్యాణ్తో పరిచయం లేదు. శ్యామ్ కె.నాయుడు ద్వారా చోటా కె.నాయుడుని కలుసుకొన్నా. 'నాకు కథ వినిపించు. నచ్చితే పవన్కి సిఫారసు చేస్తా' అన్నారు.
నా కథను చోటా.కె. సరిగ్గా అర్థం చేసుకొంటారో లేదో అని.. ఆయనకు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' కథ చెప్పా. అది చోటాకి బాగా నచ్చింది. వెంటనే పవన్కి నన్ను పరిచయం చేశారు. పవన్ కల్యాణ్కి 'బద్రి' కథ వినిపించా. తనకి కథ నచ్చింది గానీ, 'ఏదో ఆత్మహత్య కథ అన్నాడు.. నువ్వేమో ఇది చెప్పావ్..' అని అడిగారు. 'మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఆడిన డ్రామా అది..' అని నిజం చెప్పేశా. అలా నా మొదటి సినిమా 'బద్రి'కి అంకురార్పణ జరిగింది అన్నారు.
నితిన్ హీరోగా నటించిన తన తాజా చిత్రం హార్ట్ ఎటాక్ భారీ ఓపెనింగ్స్ సాధించిందని, విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని పూరీ జగన్నాథ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'తొలిరోజు నైజాం ఏరియాలో ఒక కోటి తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసి నితిన్ సినిమాల్లో రికార్డ్ నెలకొల్పింది. మిగతా ఏరియాల్లోనూ కలెక్షన్లు చాలా బాగున్నాయ'ని పూరీ జగన్నాథ్ చెప్పారు.