twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారం: కోర్టుకు శ్వేతా బసు, రెస్క్యూ హోంకు తరలింపు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు సినీ నటి శ్వేతా బసు ప్రసాద్‌ను పోలీసులు ఎర్రమంజిల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఆమెను రెస్క్యూ హోంకు తరలించారు. శ్వేతా బసు వ్యవహారం వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో శ్వేతా బసు రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

    హోటల్‌పై జరిపిన దాడిలో సినీనటి, ఆమెతో పాటు ఉన్న పేరుమోసిన పారిశ్రామిక వేత్త పట్టుబడ్డారు. అయిత, ఆ పారిశ్రామికవేత్త ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొనిరావటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అదుపులోకి తీసుకున్న ఆ సినీనటిని పునరావాస కేంద్రానికి తరలించారు.

    Shweta Basu Prasad produced before the court

    బ్రోకర్‌ బాలును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతను రూ.లక్ష కమీషన్‌ తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో 'కొత్త బంగారు లోకం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్వేతా బసు ఆ తర్వాత అవకాశాలు దగ్గడంతో ఐటం సాంగులు చేయడం ప్రారంభించింది.

    అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా....తన విలాసవంతమైన జీవితానికి సరిపడ డబ్బు సంపాదించే పరిస్థితి లేక పోవడంతో ఇలా వ్యభిచారం చేస్తూ అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడింది శ్వేతా బసు. గతంలో కూడా శ్వేతా బసు వ్యభిచారం చేస్తూ ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో దొరికి పోయింది.

    English summary
    Shweta Basu Prasad produced before the erramanzil court. Swetha Basu was caught involving in prostitution by Hyderabad West Zone police who have raided a popular 2-star hotel in Banjara Hills on late Sunday evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X