Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వ్యభిచారం: కోర్టుకు శ్వేతా బసు, రెస్క్యూ హోంకు తరలింపు
హైదరాబాద్: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు సినీ నటి శ్వేతా బసు ప్రసాద్ను పోలీసులు ఎర్రమంజిల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఆమెను రెస్క్యూ హోంకు తరలించారు. శ్వేతా బసు వ్యవహారం వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో శ్వేతా బసు రెడ్ హాండెడ్గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే.
హోటల్పై జరిపిన దాడిలో సినీనటి, ఆమెతో పాటు ఉన్న పేరుమోసిన పారిశ్రామిక వేత్త పట్టుబడ్డారు. అయిత, ఆ పారిశ్రామికవేత్త ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొనిరావటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అదుపులోకి తీసుకున్న ఆ సినీనటిని పునరావాస కేంద్రానికి తరలించారు.
బ్రోకర్ బాలును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతను రూ.లక్ష కమీషన్ తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో 'కొత్త బంగారు లోకం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్వేతా బసు ఆ తర్వాత అవకాశాలు దగ్గడంతో ఐటం సాంగులు చేయడం ప్రారంభించింది.
అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా....తన విలాసవంతమైన జీవితానికి సరిపడ డబ్బు సంపాదించే పరిస్థితి లేక పోవడంతో ఇలా వ్యభిచారం చేస్తూ అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడింది శ్వేతా బసు. గతంలో కూడా శ్వేతా బసు వ్యభిచారం చేస్తూ ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో దొరికి పోయింది.