Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాది ప్రాధాన్యత లేని పాత్రే ..త్రిష
'గ్యాంబ్లర్' చిత్రంలో పెద్ద ప్రాధాన్యత లేని పాత్ర చేసారు కదా అంటే త్రిష అవునని ఒప్పుకుని దానికి కారణం వివరించింది. ''దర్శకుడు వెంకట్ ప్రభు యూనిట్లో 'వర్క్' చేయడం అంటే చాలా సరదాగా ఓ 'పిక్నిక్'లా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన టెన్షన్ పడకుండా, ఆర్టిస్టులను టెన్షన్కు గురి చేయకుండా నటింపజేస్తారు. అదొక కారణమైతే అజిత్ సార్ ప్రతిభగల నటుడు మాత్రమే కాకుండా ఆయన అద్భుతంగా వంట చేస్తారు. ఆయన సొంత ప్రత్యేక వాహనంలో మేకప్కు అవసరమైన సౌకర్యాలతో పాటు చిన్న 'కిచెన్' కూడా ఉంటుంది. ఆయనతో షూటింగ్ ఉన్న రోజున 'లంచ్' సమయంలో ఆయన స్వయంగా చేసే స్పెషల్ బిరియానీ మా అందరికీ పెడతారు. అదెంత బావుంటుందో! వంటల్లోనే కాదు, పాత్రల ఎంపికలోనూ ఆయన స్పెషలే!! లేకపోతే 'గ్యాంబ్లర్' చిత్రంలో 'నెగెటివ్ షేడ్' ఉన్న ఆ పాత్రను ఎంపిక చేసుకోడానికి ఎంత ధైర్యం ఉండాలి?'' అని త్రిష మెచ్చుకుంది.
అలాగే నాకు స్వతహాగా లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఇష్టం ఉండదు.ఇది గ్లామర్ ప్రపంచం. దానికి తగ్గట్టుగానే మనం పాత్రలను ఎంచుకోవాలి. ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. అరుంధతి లాంటి సినిమా హిట్ అయ్యిందంటే... దానికి చాలా కారణాలున్నాయి. కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాదు. నా వరకూ గ్లామర్గా కనిపించడానికి ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది త్రిష. టూ పీస్ బికినీపై అభిప్రాయం అనడిగితే అది ఎంత హాట్ ట్రెండ్ అయినా... ప్రస్తుతానికైతే నేను అలాంటి సాహసం చేయలేను. భవిష్యత్తులో చేస్తానేమో ఇప్పుడే చెప్పలేను అని తేల్చేసింది. ఇక తెలుగులో త్రిష ప్రస్తుతం వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో చేస్తోంది. డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలగు చిత్రం. వీటితో పాటు ఆమె విశాల్ సినిమాను కూడా ఓకే చేసింది. ఇక త్రిష హఠాత్తుగా విశాల్ ప్రాజెక్టుని ఎందుకు ఓకే చేసింది అంటే.. దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది.ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది.