Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గౌతమ్ మీనన్ కి షాక్...సినిమాలు తీయటం ఆపమన్న కోర్టు
చెన్నై: ఏమి మాయ చేసావే, ఎటో వెళ్లి పోయింది మనస్సు వంటి ప్రేమ కథలతో తనకంటూ తెలుగులోనూ క్రేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన కు తాజాగా చెన్నై సివిల్ కోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన తదపురి ఆర్డర్స్ వచ్చేవరకూ సినిమాలు చేయరాదని ఆదేశించింది. దానికి కారణం..ఆయన స్నేహితుడు జయరామన్ కోర్టులో వేసిన కేసే.
వివరాల్లోకి వెళితే... జయరామన్... ఏమి మాయ చేసావే తమిళ వెర్షన్ నిర్మాతలలో ఒకరు..గౌతమ్ మీనన్ ప్రెండ్. ఆయన 2008లో తన బ్యానర్ లో ఒక సినిమా చేయమని నాలుగున్నర కోట్లు గౌతమ్ కి అడ్వాన్స్ గా ఇచ్చారు. అయితే దాన్ని వదిలేసి గౌతమ్ తన తదుపరి ప్రాజెక్టులలో పడిపోయారు. సూర్యతో తన తదుపరి చిత్రం ప్రకటించారు. ఇది చూసి కోపం తెచ్చుకున్న జయరామన్..గౌతమ్ పై కేసు వేసారు.
ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సెటిల్ మెంట్ చేసుకోవాల్సిందే కానీ కోర్టు ద్వారా తేలేదు కాదని అంటున్నారు. జయరామన్ మాత్రం చాలా పట్టుదలగా ఉన్నారు. గౌతమ్ మీనన్ తాను చేయనని అనలేదని, వాయిదా మాత్రమే వేసానని అంటున్నారు. ఏదైమైనా ఓ పెద్ద దర్శకుడుకి ఇలా జరగటం,సినిమాలు ఆగిపోవటం ఆయన అభిమానులను కలిచి వేస్తోంది.
గతంలో గతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'చెలి', 'ఏ మాయ చేసావె' చిత్రాలు రెగ్యులర్ ప్రేమ కథా చిత్రాలే అయినా.... విభిన్నమైన ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో పాటు, డిఫరెంట్ క్లైమాక్స్ ఉండటం వల్లనే మంచి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు తన తాజా సినిమా 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం విషయంలో మాత్రం గౌతమ్ మీనన్ కు ఎదురు దెబ్బ తగిలింది. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫెయిల్ అయ్యింది. దాంతో వెంటనే పెద్ద హీరోతో చేసి మళ్లీ ఫామ్ లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నారు.