Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గౌతమ్ మీనన్ పై నిర్మాత కేసు..వివాదం
నిర్మాత ఎల్రెడ్ కుమార్ మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో, సాధారణంగా ఎక్కువగా మాట్లాడని మీనన్ బహిరంగ లేఖతో సినీ వర్గాల ముందుకు వచ్చారు. ఈ లేఖలో ఆయన సినీ వర్గాలు ఐక్యంగా వచ్చి తనకు సాయపడాలని కోరారు. ఈ పోరాటాన్ని తాను ఒంటరిగా ఎదుర్కోలేనని పేర్కొన్నారు. 'చిత్రం అంచనాల మేరకు విజయం సాధించకపోతే నిర్మాతలు కేసులు పెడుతారు జాగ్రత్తగా ఉండండి' అంటూ ఆయన తన సహసినీదర్శకులకు సూచించారు.
'తమిళంలో 'నీథానే ఎన్ పోన్వసంతం' (తెలుగులో 'ఎటో వెళ్ళిపోయింది మనసు') చిత్రాన్ని తాను చాలా ఇష్టంగా నిర్మించానని, అయినా ఆ చిత్రం సరిగ్గా ఆడలేదని, ఆ నెపంతో నిర్మాత తనకు లీగల్ నోటీసులు పంపటం సరికాద'ని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో పరిశ్రమ తనకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వాలని నిర్మాత తనని డిమాండ్ చేశారని ఆయన తెలిపారు.
అలాగే ఇక మీదట తాను చిత్రాలు తియ్యకుండా నిరోధించేలా ఆర్డర్ సంపాదించేందుకు కుమార్ ప్రయత్నించగా ఆ కేసును కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఆ తర్వాత ఎల్రెడ్ మరో కేసు ఫైలు చేశారని, అందులో దాదాపు 9.5 కోట్ల రూపాయలతో పాటు తన ఇంటిని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రం పరాజయం కంటే ముందు నుంచే ఆ నిర్మాతతో చాలా సమస్యలున్నాయని ఆయన తెలిపారు. చిత్ర నిర్మాణ సమయంలో హీరో ఎంపిక నుంచి సంగీత దర్శకుని వరకు, బడ్జెట్ మొదలుకొని ప్రతి విషయం సమస్యగానే సాగిందని అన్నారు.